‘నిజాం మినార్’ ప్రారంభించిన మంత్రి కెటిఆర్(పిక్చర్స్)
హైదరాబాద్: నగర శివారులోని ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జంటజలాశయాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు. సోమవారం గండిపేటలోని హోటల్ గోల్కొండ రిసార్ట్స్లో జువెల్ ఆఫ్ నిజాం-మినార్ రెస్టారెంట్ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్ సంస్కృతీ సంప్రదాయాలకు గోల్కొండ పర్యాయపదమని, ఆ పేరుతో హోటల్ నిర్వహిస్తున్న యాజమాన్యం నగర రుచులను ప్రపంచానికి చాటిచెప్పడంలో తనకుతాను సాటిగా నిలిచిందన్నారు. వంద అడుగుల ఎత్తులో గండిపేట చెరువుకు సమీపంలో నిర్మించిన జువెల్ ఆఫ్ నిజాం మినార్ రెస్టారెంట్ అతిథులకు ఆహ్లాదకరమైన ప్రాంతమని చెప్పారు.
ఐటీ సెక్టార్కు చేరువలో ఉన్న జంట జలాశయాలను పర్యాటక కేంద్రంగా మార్చితే చుట్టు పక్కల గ్రామాలు మరింత తొందరగా అభివృద్ది చెందుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, హోటల్ అధినేత సురేశ్రెడ్డి, గోల్కొండ రిసార్ట్సు ప్రతినిధులు పాల్గొన్నారు.
కెటిఆర్
నగర శివారులోని ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జంటజలాశయాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు.
నిజాం మినార్
సోమవారం గండిపేటలోని హోటల్ గోల్కొండ రిసార్ట్స్లో జువెల్ ఆఫ్ నిజాం-మినార్ రెస్టారెంట్ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
నిజాం మినార్
హైదరాబాద్ సంస్కృతీ సంప్రదాయాలకు గోల్కొండ పర్యాయపదమని, ఆ పేరుతో హోటల్ నిర్వహిస్తున్న యాజమాన్యం నగర రుచులను ప్రపంచానికి చాటిచెప్పడంలో తనకుతాను సాటిగా నిలిచిందన్నారు.
నిజాం మినార్
వంద అడుగుల ఎత్తులో గండిపేట చెరువుకు సమీపంలో నిర్మించిన జువెల్ ఆఫ్ నిజాం మినార్ రెస్టారెంట్ అతిథులకు ఆహ్లాదకరమైన ప్రాంతమని చెప్పారు.
నిజాం మినార్
ఐటీ సెక్టార్కు చేరువలో ఉన్న జంట జలాశయాలను పర్యాటక కేంద్రంగా మార్చితే చుట్టు పక్కల గ్రామాలు మరింత తొందరగా అభివృద్ది చెందుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు.