హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒకే వేదికపై నటి ఖుష్బూతో ఎంపీ కవిత(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రేపటి తరాలకు నాణ్యమైన విధ్యను హక్కుగా అందించాలనే ఉద్దేశ్యంతో ప్రతి యేడు నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక థింక్ ఎడ్యుకేషన్ 2015 సెమినార్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు పాల్గొని మాట్లాడారు.

చెన్నైలోని ఐటిసీ చోళ హోటల్ లో ఈనెల 20, 21 తేదీలలో జరిగిన ఈ సమావేశానికి దేశ వ్యాప్తంగా ఎంపిక చేయబడ్డ 40 మంది వివిధ రంగాలలోని ప్రముఖులను నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ సెమినార్ లో పాల్ఘొన్న ఎంపీ శ్రీమతి కవిత మన విద్య వ్యవస్తలో రావలసిన మార్పుల గురించి ప్రత్యేకించి బాలికల విద్యకు తీసుకోవలసిన చర్యల గురించి మాట్లాడారు.

పాఠ్య ప్రణాళికల నిర్మాణంలో స్త్రీలకోసం ప్రత్యేకంగా తీసుకురావల్సిన మార్పులతో పాటు విద్యను అందించడంలో కింది స్థాయిలో ఎదురవుతున్న ప్రతిబందకాలను శ్రీమతి కవిత ప్రస్తావించారు. గ్రామీణ భారతంలో విద్యకు ఇవ్వవల్సిన ప్రాధాన్యత దక్కేలా ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు కృషి చేయాలని చెప్పారు.

ఆరు విభాగాలుగా ఏర్పాటైన ఈ సదస్సులో ఎంపీ కవితతోపాటు కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి హర్షవర్ధన్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్, ఇస్రో చైర్మన్ డాక్టర్ రాధాక్రిష్ణన్, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్, లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ్, సినీనటి ఖుష్బూ, నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్, ఇతర రాజకీయ, వ్యాపార, కళలు, సేవ తదితర రంగాలకు ప్రముఖులు దేశవ్యాప్తంగా మొత్తం 40మంది పాల్గొన్నారు.

 ఒకే వేదికపై సినీనటి ఖుష్బూతో ఎంపీ కవిత

ఒకే వేదికపై సినీనటి ఖుష్బూతో ఎంపీ కవిత

రేపటి తరాలకు నాణ్యమైన విధ్యను హక్కుగా అందించాలనే ఉద్దేశ్యంతో ప్రతి యేడు నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక థింక్ ఎడ్యుకేషన్ 2015 సెమినార్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు పాల్గొని మాట్లాడారు.

 ఒకే వేదికపై సినీనటి ఖుష్బూతో ఎంపీ కవిత

ఒకే వేదికపై సినీనటి ఖుష్బూతో ఎంపీ కవిత

చెన్నైలోని ఐటిసీ చోళ హోటల్ లో ఈనెల 20, 21 తేదీలలో జరిగిన ఈ సమావేశానికి దేశ వ్యాప్తంగా ఎంపిక చేయబడ్డ 40 మంది వివిధ రంగాలలోని ప్రముఖులను నిర్వాహకులు ఆహ్వానించారు.

ఒకే వేదికపై సినీనటి ఖుష్బూతో ఎంపీ కవిత

ఒకే వేదికపై సినీనటి ఖుష్బూతో ఎంపీ కవిత


ఈ సెమినార్ లో పాల్ఘొన్న ఎంపీ శ్రీమతి కవిత మన విద్య వ్యవస్తలో రావలసిన మార్పుల గురించి ప్రత్యేకించి బాలికల విద్యకు తీసుకోవలసిన చర్యల గురించి మాట్లాడారు.

 ఒకే వేదికపై సినీనటి ఖుష్బూతో ఎంపీ కవిత

ఒకే వేదికపై సినీనటి ఖుష్బూతో ఎంపీ కవిత

పాఠ్య ప్రణాళికల నిర్మాణంలో స్త్రీలకోసం ప్రత్యేకంగా తీసుకురావల్సిన మార్పులతో పాటు విద్యను అందించడంలో కింది స్థాయిలో ఎదురవుతున్న ప్రతిబందకాలను శ్రీమతి కవిత ప్రస్తావించారు.

ఒకే వేదికపై సినీనటి ఖుష్బూతో ఎంపీ కవిత

ఒకే వేదికపై సినీనటి ఖుష్బూతో ఎంపీ కవిత

గ్రామీణ భారతంలో విద్యకు ఇవ్వవల్సిన ప్రాధాన్యత దక్కేలా ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు కృషి చేయాలని చెప్పారు.

 ఒకే వేదికపై సినీనటి ఖుష్బూతో ఎంపీ కవిత

ఒకే వేదికపై సినీనటి ఖుష్బూతో ఎంపీ కవిత

ఆరు విభాగాలుగా ఏర్పాటైన ఈ సదస్సులో ఎంపీ కవితతోపాటు కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి హర్షవర్ధన్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్, ఇస్రో చైర్మన్ డాక్టర్ రాధాక్రిష్ణన్, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్, లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ్, సినీనటి ఖుష్బూ, నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్, ఇతర రాజకీయ, వ్యాపార, కళలు, సేవ తదితర రంగాలకు ప్రముఖులు దేశవ్యాప్తంగా మొత్తం 40మంది పాల్గొన్నారు.

English summary
Nizamabad MP Kalvakuntla Kavitha participated in think education 2015 conclave in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X