భయపడకండి, తెలంగాణలో పోరాడండి: చంద్రబాబు, ఇదీ జగన్
హైదరాబాద్: ప్రజల సమస్యల పైన రాజీలేని పోరాటం చేయాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం సూచించారు. అక్రమ కేసులు ఎన్ని పెట్టినా భయపడాల్సిన పని లేదని ధైర్యం చెప్పారు.
పార్టీ యంత్రాంగాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండటం నచ్చని ఇతర పార్టీల వారు కక్ష కట్టి బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ యంత్రాంగమంతా ఐక్యంగా ఉంటూ వాటిని ఎదుర్కోవాలని సూచించారు.

తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ, సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు, రావుల చంద్రశేఖర రెడ్డి తదితరులు బాబుతో భేటీ అయ్యారు. తెలంగాణలో టీడీపీకి వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాల పైన వారు చర్చించారు.
కేసీఆర్, జగన్ ఇంతకాలం రహస్య స్నేహితుల్లా వ్యవహరించారని, ఇప్పుడు వారి ముసుగు తొలగించి బాహాటంగానే కుట్రలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో రైతులు, పేదల తరఫున పోరాడాలని చంద్రబాబు సూచించారు. తెరాస టీడీపీని బలహీనపరచాలని చూస్తోందని చంద్రబాబు అన్నారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications