హైటెక్ సిటీ ఓ పిచ్చి సిటీ: బాబుపై కెసిఆర్(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రసమితి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో వన్ మ్యాన్ షోగా నడిపించారు ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు. మంగళవారం కొంపల్లిలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగంతో ప్రారంభమై.. ఆయన ప్రసంగంతోనే ముగిసింది.
కెసిఆర్ తన ప్రసంగంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హైదరాబాద్ను నేనే కట్టిన అని ఒగడంటడు. హైటెక్గా మార్చానని మరొకడు అంటడు. ఇంకోడు ఇంకేదో అంటడు. నిజానికి హైదరాబాద్ పిచ్చోళ్ల సిటీగా అయ్యింది. ప్రభుత్వం, మున్సిపాలిటీ వల్ల హైదరాబాద్ సిటీ నడవటంలేదు. కేవలం ధర్మం మీద నడుస్తోంది' అని అన్నారు.
రెండేళ్లకోసారి చేపట్టే టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం, సంస్థాగత నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ఈ విస్తృతస్థాయి సమావేశానికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పది జిల్లాల నుంచి ప్రతినిధులు మొత్తం సుమారు 4వేల మందికిపైగా హాజరయ్యారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం ప్రారంభమై సాయంత్రం వరకు సాగింది. దీంతో చాలా మంది మంత్రులు, ఇతర ముఖ్యులు ఉదయం 11 గంటలకే సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు.
సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2.25 గంటలకు వేదిక వద్దకు వచ్చారు. తొలుత అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం టిఆర్ఎస్పీపీ నేత, పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావుతో కలిసి వేదికపైకి వెళ్లారు. వేదికపైకి చేరుకున్న వెంటనే మధ్యాహ్నం 2.30 గంటలకు కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దాదాపు గంటా పది నిమిషాల పాటు ప్రసంగించిన కేసీఆర్.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పదవులు దక్కక అసంతృప్తితో ఉన్న నాయకులను తన మాటలతో బుజ్జగించే ప్రయత్నం చేశారు. సీఎం కేసీఆర్ ప్రసంగం 3.40 గంటలకు ముగియగా, అంతటితో సమావేశం కూడా ముగిసింది టిఆర్ఎస్లో చేరిన గట్టు.

టిఆర్ఎస్ ప్లీనరీ
తెలంగాణ రాష్ట్రసమితి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో వన్ మ్యాన్ షోగా నడిపించారు ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు.

టిఆర్ఎస్ ప్లీనరీ
మంగళవారం కొంపల్లిలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగంతో ప్రారంభమై.. ఆయన ప్రసంగంతోనే ముగిసింది.

టిఆర్ఎస్ ప్లీనరీ
రెండేళ్లకోసారి చేపట్టే టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం, సంస్థాగత నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ఈ విస్తృతస్థాయి సమావేశానికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పది జిల్లాల నుంచి ప్రతినిధులు మొత్తం సుమారు 4వేల మందికిపైగా హాజరయ్యారు.

కెసిఆర్
నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం ప్రారంభమై సాయంత్రం వరకు సాగింది. దీంతో చాలా మంది మంత్రులు, ఇతర ముఖ్యులు ఉదయం 11 గంటలకే సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు.

టిఆర్ఎస్ ప్లీనరీ
సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2.25 గంటలకు వేదిక వద్దకు వచ్చారు. తొలుత అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించారు.

టిఆర్ఎస్ ప్లీనరీ
అనంతరం టిఆర్ఎస్పీపీ నేత, పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావుతో కలిసి వేదికపైకి వెళ్లారు. వేదికపైకి చేరుకున్న వెంటనే మధ్యాహ్నం 2.30 గంటలకు కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

టిఆర్ఎస్ ప్లీనరీ
దాదాపు గంటా పది నిమిషాల పాటు ప్రసంగించిన కేసీఆర్.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పదవులు దక్కక అసంతృప్తితో ఉన్న నాయకులను తన మాటలతో బుజ్జగించే ప్రయత్నం చేశారు.

టిఆర్ఎస్ ప్లీనరీ
సీఎం కేసీఆర్ ప్రసంగం 3.40 గంటలకు ముగియగా, అంతటితో సమావేశం కూడా ముగిసింది.

ఎంపి కవిత
టిఆర్ఎస్ ఎంపీ కవిత సభాప్రాంగణానికి చేరుకున్నప్పుడు పలువురు ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు లేచి నిల్చొని అభివాదం చేశారు.

టిఆర్ఎస్ ప్లీనరీ
మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన మాజీ డిప్యూటీ సీఎం టి.రాజయ్య సభాప్రాంగణానికి చేరుకున్నప్పుడు అందరూ ఆయనను పలుకరించారు. మంత్రులు లేచి సీటు ఇచ్చే ప్రయత్నం చేశారు.

టిఆర్ఎస్ ప్లీనరీ
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అయితే రాజయ్య వద్దకు వెళ్లి మరీ పలకరించారు. మంత్రి కేటీఆర్ ముంబై పర్యటనలో ఉండటంతో సమావేశానికి హాజరుకాలేదు.

టిఆర్ఎస్ ప్లీనరీ
రెండేళ్లకోసారి చేపట్టే టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం, సంస్థాగత నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ఈ విస్తృతస్థాయి సమావేశానికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పది జిల్లాల నుంచి ప్రతినిధులు మొత్తం సుమారు 4వేల మందికిపైగా హాజరయ్యారు.

టిఆర్ఎస్ ప్లీనరీ
విస్తృతస్థాయి సమావేశానికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పది జిల్లాల నుంచి ప్రతినిధులు మొత్తం సుమారు 4వేల మందికిపైగా హాజరయ్యారు.

టిఆర్ఎస్ ప్లీనరీ
ప్లీనరీలో పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు.

టిఆర్ఎస్ ప్లీనరీ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గట్టు రామచందర్ రావు తన అనుచరులతో కలిసి సిఎం కెసిఆర్ సమయంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన కూడా టిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు.

టిఆర్ఎస్ ప్లీనరీ
మంగళవారం కొంపల్లిలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగంతో ప్రారంభమై.. ఆయన ప్రసంగంతోనే ముగిసింది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications