'విదేశాంగ శాఖ' కాదు, ఎన్నారై శాఖ బలోపేతం.. : స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం
హైదరాబాద్ : విదేశాంగ శాఖ ఏర్పాటు దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్న వార్తల్లో నిజం లేదని తెలిసింది. తాజాగా కేటీఆర్ కార్యాలయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు కొత్తగా ప్రతిపాదించబోతున్న ఎన్నారై పాలసీతో గతంలో ఉన్న ఎన్నారై వ్యవహారాల శాఖనే బలోపేతం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.

పెట్టుబడులకు సంబంధించి ఆయా దేశాలతో రాష్ట్ర వ్యవహారాలను చక్కదిద్దేందుకు దేశంలోనే తొలిసారిగా విదేశాంగ శాఖను ఏర్పాటు చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు ఊహాగానాలు వెలువడ్డాయి. దీనికి మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తారన్న వాదన కూడా వినిపించింది. అయితే దీనిపై స్పష్టత ఇచ్చిన ప్రభుత్వ వర్గాలు అలాంటి ప్రయత్నాలేవి జరగట్లేదని ధృవీకరించాయి. దీంతో విదేశాంగ శాఖ ఏర్పాటు విషయం వార్తల్లో ఊహాగానాలకే పరిమితమైంది.
ఇదిలా ఉంటే కొత్త ఎన్నారై పాలసీపై త్వరలోనే కేబినెట్ సమావేశం నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కేబినెట్ ఆమోదం పొందగానే కొత్త ఎన్నారై పాలసీ అమలులోకి రానున్నట్టు సమాచారం.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications