ఉస్మానియా వర్సిటీలో నాన్ బోర్డర్స్కు షాక్: 4రోజులే టైమ్!
నగరంలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వర్సిటీలో చదువుతున్న విద్యార్థులు మాత్రమే యూనివర్శిటీ హాస్టళ్లలో ఉండాలన్న నిబంధన యూనివర్సిటీ ఆరంభం నుంచ
హైదరాబాద్: నగరంలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వర్సిటీలో చదువుతున్న విద్యార్థులు మాత్రమే యూనివర్శిటీ హాస్టళ్లలో ఉండాలన్న నిబంధన యూనివర్సిటీ ఆరంభం నుంచి ఉంది. అయితే, ఆ నిబంధనను ఇప్పుడు అమలు చేస్తుండటమే ఇందుకు కారణం.

ఆందోళనలు వారివల్లే..
ఇంతకుముందు మాత్రం ఈ నిబంధన అమలులో లేదని సిబ్బంది పలు సందర్భాల్లో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో భారీ ఎత్తున నాన్ బోర్డర్స్ ఉస్మానియాలో తిష్టవేశారని పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వర్సిటీలో జరిగే ఆందోళనల్లో వారే ఎక్కువగా పాల్గొంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
Recommended Video


ఈ క్రమంలోనే..
ఈ నేపథ్యంలోనే ఉస్మానియాలో నాన్ బోర్డర్స్ విషయంలో ఉదాసీనత పనికిరాదనే నిర్ణయానికి పాలక కమిటీ వచ్చింది. దీంతో తక్షణం నాన్ బోర్డర్స్ని ఖాళీ చేయించేందుకు చర్యలు చేపట్టింది. కేవలం నాలుగంటే నాలుగే రోజుల్లో యూనివర్సిటీలోని అన్ని హాస్టళ్ల నుంచి నాన్ బోర్డర్స్ ను ఖాళీ చేయించాలని, వార్డెన్లు తనిఖీలు నిర్వహించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

కఠిన చర్యలే..
మొండికేసిన వారిని ఖాళీ చేయించేందుకు అవసరమైతే యూనివర్సిటీ హాస్టళ్లకు విద్యుత్, నీటి సరఫరా నిలిపేయాలని సూచించింది. అప్పటికీ నాన్ బోర్డర్లు ఖాళీ చేయకుంటే పోలీసుల సహకారం తీసుకుంటామని స్పష్టం చేసింది.

ఉద్యోగార్థులకు షాకే..
అయితే, పలు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువకులు స్నేహితుల సహకారంతో యూనివర్సిటీల్లో ఉంటారు. లైబ్రరీ సౌకర్యం అందుబాటులో ఉండటంతో ఉద్యోగార్థులకు ఉస్మానియా యూనివర్సిటీలోనే పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంటారు. ఈ కారణంగానే పలువురు విద్యార్థులు ఉస్మానియాలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. తాజా నిబంధనతో వారు కూడా వర్సిటీ వదిలివెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications