Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓలా, ఉబేర్, రాపిడో.. బంద్

ఉబేర్, ఓలా, ర్యాపిడో వంటి ప్రధాన రైడ్ హెయిలింగ్ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించిన డ్రైవర్లు ఈ నెల 7వ తేదీ నుంచి దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. ఛార్జీల విధానాలపై తీవ్ర అసంతృప్తి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై నిరసన వ్యక్తం చేయడమే ఈ సమ్మెకు ప్రధాన కారణం. ఈ సమ్మెకు తెలంగాణ యాప్ ఆధారిత డ్రైవర్స్ ఫోరమ్ (TADF) పిలుపునిచ్చింది. అస్థిరమైన పని స్థితిగతులు, ప్రభుత్వ నుండి ఎటువంటి సహాయ సహకారాలు, స్పందన లేకపోవడం, ఆర్థిక భద్రత లేకపోవడం వంటి కారణాలతో సమ్మెకు దిగనున్నారు.

తమ సమస్యలను పరిష్కరించాలని, కనీస బేస్ ఛార్జీలను ఖరారు చేయాలని ఆయా రైడ్ హెయిలింగ్ ప్లాట్ ఫామ్ డ్రైవర్లు చాలాకాలంగా డిమాండ్ చేస్తూ వస్తోన్నారు. దేశవ్యాప్తంగా సమ్మె జరుగనుంది. ఆల్-ఇండియా బ్రేకడౌన్ ను టీఏడీఎఫ్ ధృవీకరించింది కూడా. డ్రైవర్లు ఎదుర్కొంటున్న పెరిగిన ఆర్థిక ఒత్తిళ్లు, అస్థిరమైన పని పరిస్థితులపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడమే ఈ సమ్మె, నిరసనల ప్రధాన ఉద్దేశమని పేర్కొంది.

Ola Uber Rapido Drivers Announces Strike from February 7 Across India Over Fare Exploitation

2025 మోటారు వాహన అగ్రిగేటర్ మార్గదర్శకాలు నోటిఫై చేసినప్పటికీ- అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్‌లు ఇప్పటికీ పారదర్శకత లేకుండా ఛార్జీలను నిర్ణయిస్తున్నాయి. ఇటువంటి పద్ధతులు డ్రైవర్లను ఆదాయ అస్థిరత, అప్పులు, నిలకడ లేని ఉపాధి పరిస్థితుల వైపు నెట్టివేస్తున్నాయని ఫోరమ్ వాదిస్తోంది. నియంత్రణ పర్యవేక్షణ కొరత కారణంగా సర్జ్ ధరల వ్యూహాల వల్ల ప్రయాణికులు కూడా ప్రభావితమవుతున్నారని తెలిపింది. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ప్లాట్‌ఫామ్‌లు జవాబుదారీతనం లేకుండా పనిచేస్తున్నాయని మండిపడింది.

కనీస బేస్ ఛార్జీలను ప్రకటించనందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఈ యూనియన్ విమర్శించింది. దీనివల్ల డ్రైవర్ల సంపాదనను తగ్గించడానికి, కమిషన్ ఛార్జీలను పెంచడానికి ఆయా కంపెనీలకు వీలు లభిస్తోందని అభిప్రాయపడింది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, వాహన నిర్వహణ, బీమా ఖర్చులు, ఇతర నష్టాల భారం పూర్తిగా డ్రైవర్లపైనే పడుతోందని, దీనివల్ల గౌరవప్రదమైన జీవనం గడపడం కష్టం అవుతోందని టీఏడీఎఫ్ పేర్కొంది.

తక్షణమే కనీస బేస్ ఛార్జీలను ప్రకటించడం, యాప్-ఆధారిత వాణిజ్య రైడ్‌ల కోసం ప్రైవేట్, వాణిజ్యేతర వాహనాల వినియోగాన్ని నిషేధించడం ప్రధాన డిమాండ్లలో ఉన్నాయి. గత ఏడాది క్రిస్మస్, న్యూ ఇయర్ ఈవ్ నాడు గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులు నిరసనలు తెలిపారు. దీనికి కొనసాగింపుగా ఈ సమ్మె పిలుపునిచ్చారు. వేతనాల్లో పారదర్శకత, వాస్తవ పని గంటలు, ఖర్చులకు అనుగుణంగా ప్రోత్సాహకాలతో కూడిన మెరుగైన పని పరిస్థితులు, సరసమైన వేతనాలను అప్పుడు కార్మికులు డిమాండ్ చేస్తోన్నారు.

అనవసరమైన ID బ్లాక్‌లు, న్యాయమైన ప్రక్రియ లేకుండా జరిమానాలను నిలిపివేయాలని, భద్రతా పరికరాలు, ప్రమాద బీమా వంటి భద్రతా నిబంధనలను బలోపేతం చేయాలని, అల్గారిథమిక్ పక్షపాతం లేకుండా పనిని సమానంగా కేటాయించాలని ఇతర డిమాండ్లు ఉన్నాయి. కార్మికులు ప్లాట్‌ఫామ్‌లు, కస్టమర్ల నుండి గౌరవప్రదమైన చికిత్సను కోరారు. అలాగే ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, పెన్షన్ ప్రయోజనాలు వంటి దీర్ఘకాలిక రక్షణలను అందించాలని విజ్ఞప్తి చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+