రియాద్ జైలులో పాతబస్తీ యువకుడు.. సుష్మాస్వరాజ్ కు లేఖ రాసిన భార్య
హైదరాబాద్ : జీవన పోరాటంలో భాగంగా విదేశాలకు వెళ్లి అక్కడి చట్టాలకు బలయ్యాడు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన సయ్యద్ ఆసిఫ్. 3 నెలలుగా రియాద్ లోని మలాద్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈక్రమంలో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెంది చివరకు ఎంబీటీ లీడర్ అంజదుల్లా ఖాన్ ను సంప్రదించారు.

దీంతో ఆయన విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కార్యాలయానికి పూర్తి వివరాలు పంపించారు. అక్కడి రాయబార కార్యాలయం అధికారులతో సంప్రదింపులు జరిపి సయ్యద్ ను స్వదేశానికి తిరిగి తెప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సయ్యద్ కు భార్య, పిల్లలు ఉండటంతో వారి పోషణ భారంగా మారింది. దీంతో ఈ కేసు త్వరితగతిన పరిష్కరించాలని విన్నవించారు.












Click it and Unblock the Notifications