Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీఎస్ఆర్టీసీ ఉగాది కానుక: సీనియర్ సిటిజన్లకు ఆరోజు ప్రయాణం ఉచితమే

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి వినూత్న తరహాలు ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు ఆఫర్లను పలు సందర్భాల్లో ప్రకటించిన ఆర్టీసీ.. తాజాగా ఉగాది పర్వ దినాన్ని పురస్కరించుకుని మరో బంపరాఫర్ ప్రకటించింది.

ఇప్పటికే చిన్నారులకు, మహిళలకు పలు ఆఫర్లు ప్రకటించిన ఆర్టీసీ.. తాజాగా, ఉగాది పండగ రోజున సీనియర్ సిటిజెన్లకు కానుక ఇచ్చింది. ఉగాది పండగ సందర్భంగా కేవలం ఏప్రిల్‌ 2వ తేదీన.. వృద్ధులకు ఉచిత ప్రయాణం ఆఫర్ చేసింది. బస్సుల్లో ప్రయాణించేటపుడు తమ దగ్గర ఉన్న గుర్తింపు కార్డును (65 ఏళ్లు దాటినట్లు) కండక్టర్‌కు చూపించి ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు. ఉగాది సందర్భంగా ఈ ప్రత్యేకమైన ఆఫర్‌ తీసుకొచ్చినట్టు వెల్లడించారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌.

 On the occasion of Ugadi, TSRTC Offers Free Ride to Senior Citizens above 65 years

ఇటీవలే ఛార్జీలు పెంచిన ఆర్టీసీ

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడంతో రాష్ట్ర ప్రజలపై భారం పడగా, ఇప్పుడు టీఎస్ఆర్టీసీ కూడా బస్సు ఛార్జీలను పెంచి ప్రయాణికుల నడ్డివిరిచింది. ప్యాసించర్ సెస్ పేరుతో ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ. 5 చొప్పున.. సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ. 10 వరకు టికెట్ రేట్లను పెంచింది. పెంచిన ఛార్జీలు తక్షణమే అమల్లోకి వస్తాయని టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. అకస్మాత్తుగా ఛార్జీలు పెంచడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు పెంపుతో ఆందోళన చెందుతుంటే.. తాజాగా, ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచుతారా? అని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇలా అన్ని ధరలు పెంచేస్తే సామాన్యులు ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు.

కాగా, హైదరాబాద్ సిటీ బస్సుల్లో బస్‌పాస్‌ ఛార్జీలను పెంచుతూ గతంలో నిర్ణయం తీసుకుంది. ఈ ఛార్జీలు ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి. జనరల్‌ బస్‌ టికెట్‌ పాసుల కేటగిరిలో ఆర్డినరీ పాస్‌ చార్జీ రూ.950 నుంచి రూ.1150కి, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.1,070 నుంచి రూ.1,300కు, మెట్రో డీలక్స్‌ రూ.1,185 నుంచి రూ.1,450కి, మెట్రో లగ్జరీ రూ.2 వేల నుంచి రూ.2,400కు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.450 నుంచి రూ.550కి, మెట్రో డీలక్స్‌ రూ.575 నుంచి రూ.700కు, ఎంఎంటీఎస్‌-ఆర్టీసీ కోంబో టికెట్‌ ఛార్జీ రూ.1,090 నుంచి రూ.1,350కి పెరిగింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+