ఓ ప్రహసనం ముగిసింది..! 31 జిల్లాలకు అద్యక్షులను నియమించిన టీ కాంగ్రెస్..!!
హైదరాబాద్: ఏ పని చేసినా హడావిడి కనిపించే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జిల్లా అద్యక్షుల నియామకం మాత్రం నిరాడంబరంగా జరిగిపోయింది. తెలంగాణలోని 31 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను పీసీసీ నియమించినపకపటికి ఎక్కడా వ్యతిరేక గళం వినిపించక పోవడవం విశేషం. ఆదిలాబాద్-భార్గవ్ దేశ్పాండే, మంచిర్యాల-కొక్కిర్యాల సురేఖ, నిర్మల్-రామారావు పటేల్ పవార్, అసిఫాబాద్-ఆత్రం సక్కు, కరీంనగర్-మృత్యుంజయం, జగిత్యాల-లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి-ఈర్ల కొమురయ్య, సిరిసిల్ల-సత్యనారాయణ గౌడ్, నిజామాబాద్-మోహన్ రెడ్డి, నిజామాబాద్ సిటీ-కేష వేణు, కామారెడ్డి-కైలాస శ్రీనివాసరావు, రంగారెడ్డి-చల్లా నర్సింహారెడ్డి, వరంగల్ అర్బన్, రూరల్-నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ సిటీ- కేదారి శ్రీనివాసరావు, భూపాలపల్లి-గండ్ర జ్యోతిని నియమించారు.
జనగామ-జంగా రాఘవరెడ్డి, సంగారెడ్డి-నిర్మల గౌడ్, మెదక్-తిరుపతి రెడ్డి, సిద్దిపేట-నర్సారెడ్డి, వికారాబాద్-రోహిత్ రెడ్డి, మేడ్చల్-కూన శ్రీశైలం గౌడ్, మహబూబ్నగర్-ఒబేదుల్లా కొత్వాల్, వనపర్తి-శంకర్ ప్రసాద్, జోగులాంబ గద్వాల్-పటేల్ ప్రభాకరరెడ్డి, నాగర్కర్నూల్-వంశీకృష్ణ, సూర్యాపేట-వెంకన్న యాదవ్, యాదాద్రి- భిక్షమయ్యగౌడ్, మహబూబాబాద్-భరతసింహారెడ్డి, నల్గొండ-కె.శంకర్ నాయక్, భద్రాద్రి-వనమా వెంకటేశ్వరరావు, ఖమ్మం-పువ్వాడ దుర్గాప్రసాద్, గ్రేటర్ హైదరాబాద్-అంజన్ కుమార్ యాదవ్ను నియమించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లా అద్యక్షులకు కూడా కొన్ని అదనపు బాద్యతలను కట్టబెట్టాలని టీపీసిసి భావిస్తున్నట్టు తెలుస్తోంది.