ఉత్తమ్ను కలిసిన ఓయూ విద్యార్థులు (పిక్చర్స్)
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆక్రమణలకు గురైన భూములను స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ ఓయూ జేఏసి నేతలు రామారావు గౌడ్, నాగారామ్ గౌడ్, సాంబశివ తదితరులు బుధవారం గాంధీభవన్లో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఓయూ భూములను కాపాడుకునే విషయంలో కాంగ్రెస్ సంపూర్ణ మద్దతిస్తుందని ఈ సందర్భంగా ఉత్తమ్ వారికి హామి ఇచ్చారు.
అంతకుముందు పదో తరగతి సాంఘికశాస్త్రం పాఠ్య పుస్తకంలోని తెలంగాణ చరిత్ర పాఠ్యాంశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ గురించి స్తావించకపోవడాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టివిక్రమార్క, ఎమ్మెల్సీలు షబ్బీర్అలీ, పొంగులేటి సుధాకర్రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీని, తెచ్చిన కాంగ్రెస్ పార్టీని విస్మరించి కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ వచ్చినట్లు రాసి భావితరాలకు తప్పుడు చరిత్రను అందించే ప్రయత్నం చేయడం దారుణమమన్నారు.
తెలంగాణ సోనియాగాంధీ వల్లే సాధ్యమైందని, ఆమెను చరిత్ర మరిచిపోదని శాసనసభ, మండలిలో పలుమార్లు ప్రస్తావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాఠ్య పుస్తకంలో ఆమె పేరును ఎందుకు పొందుపర్చలేదని నిలదీశారు. తెలంగాణ అమరుల త్యాగాన్ని సరిగా గుర్తించలేదని, ప్రొ.జయశంకర్ ప్రస్తావన ఎక్కడా లేదన్నారు.
ఉత్తమ్ను కలిసిన ఓయూ విద్యార్థులు
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆక్రమణలకు గురైన భూములను స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ ఓయూ జేఏసి నేతలు రామారావు గౌడ్, నాగారామ్ గౌడ్, సాంబశివ తదితరులు బుధవారం గాంధీభవన్లో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.
ఉత్తమ్ను కలిసిన ఓయూ విద్యార్థులు
ఓయూ భూములను కాపాడుకునే విషయంలో కాంగ్రెస్ సంపూర్ణ మద్దతిస్తుందని ఈ సందర్భంగా ఉత్తమ్ వారికి హామి ఇచ్చారు.
మీడియా సమావేశం
అంతకుముందు పదో తరగతి సాంఘికశాస్త్రం పాఠ్య పుస్తకంలోని తెలంగాణ చరిత్ర పాఠ్యాంశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ గురించి స్తావించకపోవడాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు.
మీడియా సమావేశం
ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టివిక్రమార్క, ఎమ్మెల్సీలు షబ్బీర్అలీ, పొంగులేటి సుధాకర్రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీని, తెచ్చిన కాంగ్రెస్ పార్టీని విస్మరించి కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ వచ్చినట్లు రాసి భావితరాలకు తప్పుడు చరిత్రను అందించే ప్రయత్నం చేయడం దారుణమమన్నారు.
మీడియా సమావేశం
తెలంగాణ సోనియాగాంధీ వల్లే సాధ్యమైందని, ఆమెను చరిత్ర మరిచిపోదని శాసనసభ, మండలిలో పలుమార్లు ప్రస్తావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాఠ్య పుస్తకంలో ఆమె పేరును ఎందుకు పొందుపర్చలేదని నిలదీశారు.
మీడియా సమావేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ సీనియర్నేత, కేంద్ర మాజీమంత్రి ఎస్ జైపాల్రెడ్డి మండిపడ్డారు. మోడీని చరిత్ర, రాజకీయాల గురించి జ్ఞానం లేనివ్యక్తిగా పేర్కొంటూ 'ఆయనకు జ్ఞానం పూజ్యం, అహంకారం పరిపూర్ణం' అంటూ అభివర్ణించారు.
మందకృష్ణ
ఓయూ భూముల జోలికి వస్తే రణరంగం సృష్టిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు.