హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శాసనమండలి ఛీప్‌గా బాధ్యతలు చేపట్టిన పాతూరి

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్‌గా ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పాతూరి సుధాకర్ రెడ్డి మాట్లాడారు. మండలి సమావేశాలు నిష్పక్షపాతంగా, సజావుగా సాగేలా చూస్తానని తెలిపారు. అన్ని అంశాలపై సభలో అర్థవంతమైన చర్చ జరిగేలా కృషి చేస్తానని చెప్పారు. విప్‌గా బోడకుంటి వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనను కొనియాడారు. ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి తపన పడుతున్నారని, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు మహేందర్ రెడ్డి, చందూలాల్ లతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

English summary
Paturi Sudhakar Reddy Takes Charge as Chief Whip in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X