ఓసారి కలిశాం, మెసేజ్లు: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై పవన్ కళ్యాణ్
హైదరాబాద్: హైదరాబాద్: సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ తమ పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం చెప్పారు. ఆయన సీపీఐ, సీపీఎం నేతలతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
Recommended Video

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ అంశంపై స్పందించారు.

ఆయన పార్టీలోకి వస్తే స్వాగతిస్తానని పవన్ చెప్పారు. గతంలో ఆయన, తాను ఓసారి కలిశామని చెప్పారు. జనసేన పార్టీ ఆవిర్భావం రోజున లక్ష్మీనారాయణ తనకు సందేశం పంపించారని గుర్తు చేసుకున్నారు. తనకు బెస్టఫ్ లక్ చెప్పారన్నారు. ఆ తర్వాత రెండుమూడుసార్లు ఎస్సెమ్మెస్ ఎక్స్చేంజ్ చేసుకున్నామని చెప్పారు.
కాగా, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇటీవల వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన జనసేనలో చేరుతారనే ప్రచారం కూడా సాగుతోంది. ఆయన బీజేపీ వైపు చూస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో అటు వద్దని భావిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
-
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications