తిరుమల కాలినడక మార్గం దుస్థితి ఇదీ- ప్రమాదకరం: తెలంగాణ ఎంపీ ఆందోళన
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రారంభం అయ్యే వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా లక్షలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే తొలి మూడు రోజుల కోసం మొత్తం 1,76,000 మంది భక్తులను ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఎంపిక చేశారు.

ఈ పరిస్థితుల మధ్య తిరుమల కాలినడక శుభ్రతపై వివాదం తలెత్తింది. పెద్దపల్లి లోక్ సభ సభ్యుడు గడ్డం వంశీ స్వయానా అసంతృప్తి వ్యక్తం చేశారు. కాకా (ఆయన తండ్రి జీ వెంకటస్వామి) వర్ధంతిని పురస్కరించుకొని, కుటుంబంతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్థం కాలినడకన తిరుమలకు వెళ్లానని, మార్గమధ్యలో నెలకొన్న పరిస్థితులు తనను తీవ్ర ఆందోళన కలిగించాయని అన్నారు. దీనిపై తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు.
నడక మార్గం ప్రమాదకరమైన స్థాయికి దిగజారిందని జీ వంశీ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్కు ఆయన ఒక సవాల్ విసిరారు. ఒక్కసారైనా ఏడుకొండల నడక మార్గంలో కాలినడకన వెళ్లి, ఈ దుస్థితిని స్వయంగా గమనించాలని అని కోరారు. నడక మార్గంలో ప్లాస్టిక్ వ్యర్ధాలు, నిర్మాణ శిథిలాలు విపరీతంగా చెల్లాచెదురుగా పడి ఉన్నాయని వివరించారు. మరుగుదొడ్ల కమోడ్లు, మెట్ల మధ్య బిగించిన స్టీల్ ట్రేలు నడకను ప్రమాదకరంగా మార్చాయని తెలిపారు.
On the occasion of Kaka’s death anniversary, I visited Tirupati along with my family to seek the blessings of Lord Venkateswara of the Seven Hills. While climbing the hills with devotion, the conditions we witnessed were deeply distressing.
— Vamsi Gaddam (@vkgaddam) December 23, 2025
I am throwing an open challenge to… pic.twitter.com/bxn4uKPGji
అవి భక్తులకు కాలి గాయాల ప్రమాదాన్ని పెంచుతున్నాయని వంశీ హెచ్చరించారు. అందుబాటులో కనీసం ప్రథమ చికిత్సా కేంద్రాలు కూడా అందుబాటులో లేవని ఆయన ఎత్తిచూపారు. భక్తులు వేగంగా దూసుకుపోతున్న బస్సులు, కార్ల మధ్య ప్రాణాలను పణంగా పెట్టి రోడ్డు దాటాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. భక్తుల భద్రతను పూర్తిగా నిర్లక్ష్యం చేశారా అని ప్రశ్నించారు. ఈ పరిస్థితిపై నారా లోకేష్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే, ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి, తిరుమల నడక మార్గంలో మెరుగైన సౌకర్యాలను తక్షణమే కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
-
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications