ఇంట్లో ఇద్దరికీ పెన్షన్ పక్కా.!సమస్యలు ఆలకిస్తూ,ప్రజలకు ధైర్యం కల్పిస్తూ కొనసాగుతున్న భట్టి యాత్ర.!
నాగర్ కర్నూల్/హైదరాబాద్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 77వ రోజు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగుతోంది. గురువారం ఉదయం లింగాల మండలం అంబటిపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఆవుసలికుంట, లింగాల, నర్సాయిపల్లి క్రాస్ రోడ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా దారి పొడవున ప్రజలను భట్టి విక్రమార్క కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఎర్రటి ఎండలో భట్టి యాత్ర : అవసలికుంట గ్రామంలో భట్టి పాదయాత్రకు 43 డిగ్రీల ఎండవేడిని లెక్కచేయకుండా ఆడబిడ్డలు బోనాలు ఎత్తుకొని ఎదురు వచ్చి ఘనంగా స్వాగతం పలికారు. తమ కష్టాలు వింటాడని, తమకు భరోసా, ధైర్యం ఇస్తాడని గ్రామస్తులు, అక్కచెల్లెమ్మలు పాదయాత్రలో కధం తొక్కారు. అంతేకాక డప్పు కళాకారులు, నిప్పులు కక్కే ఎండలో, వాయిద్యాలతో దరువులేస్తూ జన నాయకుడికి స్వాగతం పలికారు. వారిని చూసి ఆనందంతోనూ.. ఇంత ఎండలో తన కోసం నిలబడ్డారని ఒకింత బాధను భట్టి విక్రమార్క వ్యక్తం చేశారు.


-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications