టీ అసెంబ్లీలో నేతల దూకుడు ఇలా (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడిగా వేడుగా సాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో అధికార తెరాస, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంటోంది.
మంగళవారం తెలుగుదేశం, తెరాస మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జానా రెడ్డి ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్పందించారు.
ఆశల పల్లకిలో కూర్చోని వాస్తవ విరుద్ధమైన, ఆధారాలులేని బడ్జెట్ రూపొందించారని జానారెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీ, డాక్టర్ కే లక్ష్మణ్, రేవంత్ తదితరులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఈటెల రాజేందర్
మంగళవారం శాసన సభలో మాట్లాడుతున్న ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ దృశ్యం. ప్రతిపక్షాలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతున్న దృశ్యం.
అక్బర్
మంగళవారం శాసన సభలో మాట్లాడుతున్న మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ దృశ్యం. బడ్జెట్ను ఆయన తప్పు పట్టారు.
హరీష్ రావు
మంగళవారం శాసన సభలో మాట్లాడుతున్న భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు దృశ్యం. ప్రతిపక్షాలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతున్న దృశ్యం.
జానా రెడ్డి
ఆశల పల్లకిలో కూర్చోని వాస్తవ విరుద్ధమైన, ఆధారాలులేని బడ్జెట్ రూపొందించారని ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బడ్జెట్ ఊహాజనితంగా, విచిత్రంగా ఉందన్నారు.
జానా రెడ్డి
శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో మంగళవారం బడ్జెట్పై జరిగిన చర్చలో ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి వ్యంగ్యోక్తులతో, వాగ్బాణాలతో విమర్శలు చేశారు.
కేసీఆర్
శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో మంగళవారం బడ్జెట్పై జరిగిన చర్చలో ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి వ్యంగ్యోక్తులతో, వాగ్బాణాలతో విమర్శలు చేశారు. దీనికి కేసీఆర్ కూడా ధీటుగానే స్పందించారు.
ఈటెల రాజేందర్
మంగళవారం శాసన సభలో మాట్లాడుతున్న ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ దృశ్యం. ప్రతిపక్షాలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతున్న దృశ్యం.
పోచారం
మంగళవారం శాసన సభలో మాట్లాడుతున్న వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి దృశ్యం. ప్రతిపక్షాలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతున్న దృశ్యం.
కేటీఆర్
మంగళవారం శాసన సభలో మాట్లాడుతున్న ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీ రామారావు దృశ్యం. ప్రతిపక్షాలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతున్న దృశ్యం.
జగదీశ్వర్ రెడ్డి
మంగళవారం శాసన సభలో మాట్లాడుతున్న విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దృశ్యం. ప్రతిపక్షాలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతున్న దృశ్యం.
డాక్టర్ కే లక్ష్మణ్
మంగళవారం శాసన సభలో మాట్లాడుతున్న భారతీయ జనతా పార్టీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కే లక్ష్మణ్. ఇది కోతల బడ్జెట్ అని బీజేపీ తప్పు పట్టింది.