జైలు శిక్ష: ఐదేళ్ల క్రితం గ్యాంగ్ రేప్ చేసి, మహిళను హత్య చేసిన దోషులు వీరే (పిక్చర్స్)
హైదరాబాద్: ఐదేళ్ల క్రితం ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ హైదరాబాదులోని నాంపల్లి ఐదో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు తీర్పునిచ్చింది.
పంజాగుట్ట ఏసీపీ ఎం.వెంకటేశ్వర్లు చెప్పిన వివరాల ప్రకారం - 2011 నవంబర్ 4న ఎంఎస్ మక్తాకు చెందిన ఎన్. మల్లేశ్ (25), ఎండీ జహంగీర్ (27), ఎండీ చాంద్ (24), ఎస్కే ఆరీఫ్ (27) ఓ మహిళపై అమీర్పేట బిగ్బజార్ వద్ద సామూహికంగా లైంగిక దాడి జరిపి హత్య చేశారు.
విచారణ చేపట్టిన పంజాగుట్ట పోలీసులు అదే నెల 10న అరెస్టు చేశారు. ఈ కేసును ఇన్స్పెక్టర్లు కె.అశోక్ చక్రవర్తి, ఎన్.తిరుపతిరావు విచారణ జరపగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పద్మలత కేసును వాదించారు. ఈ మేరకు విచారించిన అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి మల్లేశ్, జహంగీర్కు యావజ్జీవం, చాంద్, ఆరీఫ్కు పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా విధించారు.

జైలు శిక్ష
హైదరాబాద్లోని అమీర్పేట బిగ్ బజార్ వద్ద ఓ మహిళపై అత్యాచారం చేసిన ఆమెను హత్య చేసిన కేసులో దోషి మల్లేష్ ఇతనే...

జైలు శిక్ష
హైదరాబాద్లోని అమీర్పేట బిగ్ బజార్ వద్ద ఓ మహిళపై అత్యాచారం చేసిన ఆమెను హత్య చేసిన కేసులో దోషి ఎండీ జహంగీర్ ఇతనే...

జైలు శిక్ష
హైదరాబాద్లోని అమీర్పేట బిగ్ బజార్ వద్ద ఓ మహిళపై అత్యాచారం చేసిన ఆమెను హత్య చేసిన కేసులో దోషి ఎండి చాంద్ ఇతనే...

జైలు శిక్ష
హైదరాబాద్లోని అమీర్పేట బిగ్ బజార్ వద్ద ఓ మహిళపై అత్యాచారం చేసిన ఆమెను హత్య చేసిన కేసులో దోషి ఎస్కె ఆరిఫ్ ఇతనే...












Click it and Unblock the Notifications