రామగుండంలో 91 ఎఫ్ఎం ప్రారంభించిన మోడీ: తెలుగు రాష్ట్రాల్లో ‘మన్ కీ బాత్’ ఇక్కడే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త ఎఫ్ఎం స్టేషన్ ప్రారంభమైంది. పెద్దపల్లి జిల్లా రామగుండంతోపాటు దేశంలోని 18 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 100 వాట్స్ సామర్థ్యం కలిగిన 91ఎఫ్(91FM) ట్రాన్స్మీటర్లను ప్రధాన నరేంద్ర మోడీ శుక్రవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. వినోదం, క్రీడలు, వాతావరణానికి సంబంధించిన సామాచారాన్ని స్థానిక ప్రజలకు చేరవేయడంలో ఎఫ్ఎం ట్రాన్స్ మీటర్లు కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
85 జిల్లాల్లో 100 వాట్ల 91 ఎఫ్ఎం ట్రాన్స్మీటర్లను ఇన్స్టాల్ చేయడం జరిగిందని ప్రధాని తెలిపారు. త్వరలో తాను రేడియోలో 'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్లో ప్రసంగిస్తానని మోడీ చెప్పారు. దేశ ప్రజలతో ఈ రకమైన భావోద్వేగ అనుబంధం రేడియో ద్వారా మాత్రమే సాధ్యమైందని చెప్పారు. కాగా, ఆల్ ఇండియా ఎఫ్ఎంకు చెందిన 91 ట్రాన్స్ మీటర్ల ప్రారంభం దేశంలోని 85 జిల్లాల్లోని 2 కోట్ల మంది ప్రజలకు బహుమతి లాంటిదని ప్రధాని మోడీ చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతోపాటు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు.
మరోవైపు, కాగజ్నగర్లో ఉన్న 'లో పవర్ టీవీ ట్రాన్సీమీటర్' కేంద్రం నుంచి సేవలు పునః ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ వర్చువల్గా ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజలందరూ రేడియో సేవలను సద్వినియోగించుకోవాలని ప్రధాని సూచించారు.

ఈ కార్యక్రమం 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 85 జిల్లాల్లో ప్రారంభం కానుందని ఆల్ ఇండియా రేడియో వెల్లడించింది. వాటిలో తెలంగాణలోని నల్గొండ జిల్లా దేవరకొండ, నల్గొండ టౌన్, పెద్దపల్లి జిల్లా రామగుండం, అసిఫాబాద్ జిల్లాసిర్పూర్ కాగజ్ నగర్ తోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఉన్నాయని వివరించింది.
This is a historic move that 91 FM transmitters will be inaugurated today. This will be very helpful in transmitting information related to entertainment, sports, and farming to the local people. Mann Ki Baat increased the popularity of radio: Union Minister Anurag Thakur attends… pic.twitter.com/A3hr9AQuYi
— ANI (@ANI) April 28, 2023
కాగా, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, లడఖ్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ ఎఫ్ఎం ట్రాన్స్ మీటర్లను అమర్చినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.
-
సఫారీలతో సమరం వేళ ప్లాన్ మార్చిన సూర్య, అభిషేక్ స్థానం ఇక...!! -
విజయవాడ వాసులకు కేంద్రం ఊహించని వరం..!! -
ఆ అండర్ డాగ్ ను ఫైనల్ లో చూడాలని ఉంది- రాహుల్ ద్రావిడ్ -
దూసుకొస్తున్న అల్పపీడనం.. ఏపీ, తెలంగాణాలలో ఈ జిల్లాలలోనే వర్షాలు! -
అక్కినేని ఫ్యాన్స్ కు లైఫ్ టైమ్ సెటిల్ మెంట్..! రాజమౌళి డైరెక్షన్ లో.. -
సునీల్ కుమార్ పై ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు, రిటైర్మెంట్ వరకూ..!! -
తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
weekly horoscope:వచ్చేవారం లక్ష్మీ నారాయణ రాజయోగంతో ఈ రాశులవారికి తిరుగేలేదు -
అర్ధరాత్రి పాకిస్తాన్ మెరుపు దాడులు- F-16 ఫైటర్ జెట్ లతో బాంబుల వర్షం -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు షాక్- ఇకపై -
అందరూ చూస్తుండగానే అవి వేసుకోమనేవారు: స్టార్ హీరోయిన్ -
పట్టాలెక్కిన తొలి హైస్పీడ్ మెట్రో, కళ్లు చెదిరే ప్రత్యేకతలు - తెలుగు రాష్ట్రాల్లో..!!












Click it and Unblock the Notifications