ప్రధాని మోడీ రామగుండం పర్యటన రగడ: వస్తే రణరంగమే.. అడ్డుకునేందుకు పక్కా వ్యూహంతో టీఆర్ఎస్!!
దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 12వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయం మొదలైంది. నవంబర్ 12వ తేదీన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ను జాతికి అంకితం చేయడానికి ప్రధాన నరేంద్ర మోడీ రామగుండం కి రానున్నారు. అయితే ప్రధానమంత్రి పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు. ఒక టిఆర్ఎస్ పార్టీకి తోడుగా వామపక్షాల నాయకులు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మోడీని అడ్డుకుని తీరుతామని తేల్చి చెబుతున్నాయి.

ప్రధాని పర్యటనపై టీఆర్ఎస్ తో పాటు వామపక్షాల అభ్యంతరం
ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉండనునట్టు తెలుస్తుంది. ఇప్పటికే మూడు సార్లు మోడీ పర్యటనకు ఏ విధంగా అయితే సీఎం కేసీఆర్ గైర్హాజరయ్యారో, ఇప్పుడు కూడా అదే కొనసాగుతుందని తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో ప్రధాని మోడీ పర్యటన ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి టిఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిన కర్మాగారాన్ని ఇప్పుడు ప్రధాని ప్రారంభించటం ఏమిటని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక వామపక్ష పార్టీల నేతలు కూడా ఇదే విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం లో స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణాకు అన్యాయం చేస్తూ ఇక్కడకు రావటం దేనికి ?
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించి తమ ప్రభుత్వాన్ని కూలగొట్టి ప్రయత్నం చేసిన బీజేపీ తీరుపై అసహనం వ్యక్తం చేయడంలో భాగంగా మోడీ పర్యటనను అడ్డుకుంటామని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఏం చేశారో చెప్పాలన్నారు. రాష్ట్రానికి అడుగడుగున ద్రోహం చేస్తూ రాష్ట్రానికి అప్పులు కూడా పుట్టినివ్వకుండా ఆంక్షలు విధిస్తూ, వడ్ల కొనుగోలు లో దోబూచులాడుతూ ప్రధాని రాష్ట్రానికి వచ్చి ఏం చేయబోతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఉద్యోగాల విషయంలో మోడీని టార్గెట్ చేస్తున్న విద్యార్ధి సంఘాలు
ఇక ఇదే సమయంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, ప్రధాని యువతను మోసం చేశారని విద్యార్థి సంఘాలు సైతం రంగంలోకి దిగుతున్నాయి. ఉద్యోగాల సంగతి తేల్చిన తరువాత ప్రధానమంత్రి ఇక్కడ అడుగు పెట్టాలని లేకపోతే అడ్డుకుని తీరుతామని హెచ్చరిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి యువతకు తీరని అన్యాయం చేస్తోందని విద్యార్థి సంఘాల నాయకులు వెల్లడించారు. ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని, కేంద్రంలో లక్షలాది ఉద్యోగాలు ఉన్నా వాటికి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేసిన వారు, ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాతే మోడీ తెలంగాణకు రావాలని డిమాండ్ చేస్తున్నారు.

ఎస్సీ వర్గీకరణ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చెయ్యటంపై వ్యతిరేఖత
ఎస్సీ వర్గీకరణ చేయకుండా తమను మోసగించిన ప్రధాని నరేంద్ర మోడీ రామగుండం కు వస్తే అక్కడ రణరంగంగా మారుతుందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. బిజెపి తమకు ఇచ్చిన హామీని విస్మరించిందని మోడీ రాకను వ్యతిరేకిస్తూ 12న రాష్ట్ర వ్యాప్తంగా నల్లజెండాలతో నిరసన చేపడతామని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటుపరం చేస్తున్న మోడీ రాకను వ్యతిరేకిస్తున్నట్టు కార్మిక సంఘాల నాయకులు వెల్లడించారు టిఆర్ఎస్కెవి, సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్టియుసి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తానికి ప్రధాని పర్యటనను అన్ని వర్గాలతో కలిపి తీవ్రంగా ప్రతిఘటించేలా టిఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసింది.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications