Modi:తెలంగాణ నుంచి ప్రధాని పోటీ, నియోజకవర్గం ఫిక్స్ - రేవంత్, కేసీఆర్ కు చెక్..!!
PM Modi from Telangana:తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కొత్త లెక్కలు తెర మీదకు తెస్తున్నాయి. కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లోనూ తమకు అనుకూల ఫలితాలు ఉంటాయని అంచనా వేస్తోంది. బీఆర్ఎస్ తిరిగి పుంజుకొనేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇదే సమయంలో బీజేపీ తెలంగాణ కేంద్రంగా కీలక నిర్ణయాలతో ముందుకు వెళ్తోంది.
బీజేపీ బిగ్ స్కెచ్
తెలంగాణలో అసెంబ్లీ పోరు ముగిసింది. ఇక లోక్ సభ ఎన్నికల సమరం ఆరంభం అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన సీట్లు..ఓట్లతో బీజేపీ కొత్త స్కెచ్ సిద్దం చేస్తోంది. 2019 ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో నాలుగు సీట్లు గెలిచింది. కానీ, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలవటంతో తెలంగాణ పైన బీజేపీ హైకమాండ్ ఫోకస్ చేసింది. అందులో భాగంగా తెలంగాణతో సహా దక్షిణాదిపైన ప్రభావం ఉండేలా కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. నేరుగా ప్రధాని మోదీని తెలంగాణ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని కోరింది. నరేంద్ర మోదీ మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తారని..అందుకు సూత్ర ప్రాయంగా అంగీకారం కుదిరిందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

మల్కాజ్గిరి నుంచి ప్రధాని పోటీ
ప్రధాని మోదీ పోటీ చేయటం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా కలిసి వస్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దక్షిణాది పైన ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. గతంలో తమిళనాడు నుంచి ప్రధాని పోటీ చేస్తారని ప్రచారం సాగింది. కానీ, అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రధాని మోదీ పలు మార్లు ప్రచారానికి వచ్చారు. దక్షిణాదిలో ఇప్పుడు బీజేపీ ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేదు. దీంతో..తెలంగాణలో ప్రస్తుత సమీకరణాలు కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. మల్కాజ్ గిరి మినీ ఇండియాగా భావిస్తారు. అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి ప్రస్తుత సీఎం రేవంత్ ఎంపీగా గెలుపొందారు.
రెండు పార్టీలకు చెక్
ప్రధాని మోదీ పోటీ చేస్తే బీఆర్ఎస్ నుంచి కొందరు బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణలోఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాలు మినహాయిస్తే.. మిగతా 13 నియోజకవర్గాలపై బీజేపీ ఫోకస్ చేసింది. బీఆర్ఎస్ను లేకుండా ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు బిగ్ స్కెచ్ తో బీజేపీ నేతలు అడుగులు వేస్తున్నారు. ప్రధాని మోదీ తెలంగాణలో పోటీ చేయటం ద్వారా అటు బీఆర్ఎస్ - ఇటు కాంగ్రెస్ కు చెక్ పెట్టాలనేది ఆ పార్టీ వ్యూహం. అందులో భాగంగా మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలని ప్రధాని ముందు బీజేపీ నేతలు ప్రతిపాదించారు. దీని పైన త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications