మంత్రి పోచారం డ్రైవర్పై మోహన్ బాబు సెక్యూరిటీ దాడి, అరెస్ట్!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వాహనం డ్రైవర్ పైన మోహన్ బాబు నివాసం వద్ద ఆదివారం దాడి జరిగింది. మోహన్ బాబు ఇంటి ముందు నిలుచున్నాడని ఆయన అనుచరులు డ్రైవర్తో వాగ్వాదానికి దిగారని సమాచారం.
ఇంటి ముందు నిలుచున్నాడని దాడికి దిగారని వార్తలు వచ్చాయి. నలుగురు బౌన్సర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఫిలిం నగర్లో చోటు చేసుకుంది. మోహన్ బాబుకు చెందిన భద్రతా సిబ్బంది, బౌన్సర్లు దాడి చేశారని తెలుస్తోంది.
పోచారం కారు డ్రైవర్ పేరు నాగరాజు. తెలిసిన వారి కోసం నాగరాజు అక్కడ ఎదురు చూస్తుండగా ఈ సంఘటన జరిగింది. దాడికి పాల్పడ్డ వారు మంచు లక్ష్మి సెక్యూరిటీ సిబ్బందిగా కూడా వార్తలు వస్తున్నాయి.
చిట్టీల పేరుతో కుచ్చు టోపీ
చిట్టీల పేరుతో ఓ నిర్వాహకుడు ఖాతాదారులకు రూ.2 కోట్ల కుచ్చు టోపీ పెట్టాడు. ఈ సంఘటన హైదరాబాదులోని యూసుఫ్గూడ యాదగిరినగర్లో చోటు చేసుకుంది. చిట్టీ నిర్వాహకుడు నర్సింహులు కొందరి వద్ద నుంచి చిట్టీల పేరుతో రూ.2 కోట్లు వసూలు చేసి ఉడాయించాడు. దీంతో బాధితులు నర్సింహులు ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు.