జనగామలో విషవాయువుల కలకలం.. పలువురికి అస్వస్థత.. కారణం ఏంటంటే!!
జనగామ జిల్లా కేంద్రంలో విషవాయువులు కలకలం రేపాయి. జనగామలోని గీత నగర్ కాలనీ సమీపంలో క్లోరైడ్ సిలిండర్ లీక్ కావడంతో 40మంది అస్వస్థతకు గురయ్యారు.
జనగామ జిల్లా కేంద్రంలో విషవాయువులు కలకలం రేపాయి. జనగామలోని గీత నగర్ కాలనీ సమీపంలో క్లోరైడ్ సిలిండర్ లీక్ కావడంతో స్థానిక ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలేం జరిగిందో అర్ధం కాక జనగామ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఇంతకు ఏం జరిగిందంటే జనగామ జిల్లా కేంద్రంలోని సబ్ జైల్ గీతా నగర్ ఏరియాలో విష వాయువు ప్రభావంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. సబ్ జైలు వద్ద గల ఓవర్ హెడ్ ట్యాంక్ వద్ద నీళ్ళలో కలిపే క్లోరైడ్ సిలిండర్ పైప్ లీకేజీ జరిగి విషవాయువు బయటికి రావడం వల్ల చుట్టుపక్కల వాళ్ళు ఈ వాయువును పీలిచి శ్వాస ఆడక దగ్గుతూ అవస్థ పడ్డారు. ఆ దారిన వెళ్తున్న పాదచారులు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇలా సుమారు 40 మందికి పైగా ఊపిరి ఆడక విపరీతమైన దగ్గు రావడంతో వారంతా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

ఇక ఈ విషయం తెలిసిన అధికారులు అప్రమత్తం అయ్యారు. ఘటనకు గల కారణాలు తెలుసుకుని సమస్యను పరిష్కరించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు . జనగామ లోని 100 పడకల జిల్లా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న బాధితులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ పరామర్శించారు . ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి అందుతున్న వైద్య సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వారందరికీ ఏమీ కాదని భరోసా ఇచ్చారు.
జనగామలో విషవాయువుల కలకలం.. పలువురికి అస్వస్థత.. కారణం ఏంటంటే..?#Janagama #Janagon #TelanganaNews #TelanganaGovt #Oneindiatelugu pic.twitter.com/zyoudEryTN
— oneindiatelugu (@oneindiatelugu) February 17, 2023
ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణాకర్ రాజు బాధితులు అందరికీ చికిత్స అందిస్తున్నామని, ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం లేదని చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగు పడగానే డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. నీటిలో కలిపే క్లోరైడ్ గ్యాస్ లీక్ అవడం వల్ల , పీల్చిన వారికి శ్వాస సమస్య వచ్చినట్లు భావిస్తునట్లు తెలిపారు. ప్రస్తుతం ఎవరికీ ప్రాణాపాయం లేదని ఆయన స్పష్టం చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications