ఏకంగా 47 ఎకరాలు కబ్జా- చిక్కుల్లో బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి
Malla Reddy: భారత్ రాష్ట్ర సమితి శాసన సభ్యుడు, మాజీ మంత్రి మల్లారెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. భూకబ్జా, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ఆరోపణలను ఆయన ఎదుర్కొంటోన్నారు. ఈ నేపథ్యంలో- పోలీసులు కేెసులు నమెదు చేశారు.
ఎన్నికల సమయంలో రాత్రిక రాత్రే మల్లా రెడ్డి తన భూములను కబ్జా చేశారంటూ షామీర్పేట్ మండలం కేశవరం గ్రామానికి చెందిన కేతావత్ బిక్షపతి అనే వ్యక్తి ఆరోపించారు. షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేశవాపూర్లో సర్వే నంబర్లు 33, 34, 35ల్లో తనకు 47 ఎకరాల 18 గుంటల భూమి ఉందని, తనకు వారసత్వంగా అందిందని వివరించారు.

దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు తన వద్దే ఉన్నాయని బిక్షపతి పోలీసులకు చెప్పారు. నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి వాటిని మల్లారెడ్డి తన పేరు మీద బదలాయించుకున్నారని, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని బాధితుడు తన ఫిర్యాదు పత్రంలో పొందుపరిచారు. ఆయనకు స్థానిక ఎమ్మార్వో సహకరించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీనితో మల్లారెడ్డితో పాటు ఎమ్మార్వోపైనా కేసు పెట్టారు పోలీసులు.
దీనిపై విచారణ జరిపించిన పోలీసులు మల్లారెడ్డితో పాటు ఆయన సమీప బంధువు శ్రీనివాస్ రెడ్డి, కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనె హరి మోహన్ రెడ్డి, మధుకర్ రెడ్డి, శివుడు, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, 420 కేసు నమోదు చేశారు.'
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
హైదరాబాద్లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్న్యూస్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications