పోలీస్ స్టేషన్లో ఒక్కటైన ప్రేమ జంట.. ఒప్పుకోరేమోనని పారిపోతే.. చివరికిలా...
పెద్దలు ఒప్పుకోరేమోనని ఇంట్లో నుంచి పారిపోయిన ఓ జంటకు పోలీసుల సమక్షంలో పెద్దల అంగీకారంతో పెళ్లి జరిగింది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం... బషీరాబాద్ మండలంలోని జీవంగికి చెందిన మహేశ్వరి,యాలాల మండలం అక్కంపల్లికి చెందిన తుప్పల ఆంజనేయులు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే ఇరువురి పెద్దలు ఒప్పుకుంటారో లేదోనన్న భయంతో ఇటీవల ఇల్లు వదిలి పారిపోయారు.
మహేశ్వరి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల దర్యాప్తులో మహేశ్వరి హైదరాబాద్లో ఉన్నట్టు తెలిసింది. ఎట్టకేలకు మహేశ్వరిని,ఆంజనేయులును గుర్తించి బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ఇరువురి కుటుంబ సభ్యులను కూడా అక్కడికే పిలిపించారు. తామిద్దరం కలిసే ఉంటామని మహేశ్వరి,ఆంజనేయులు చెప్పడంతో.. ఇరువురి కుటుంబాల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.
lockdown: లాక్ డౌన్ లో గుడిలో ప్రేమ పెళ్లి, అదే లాక్ డౌన్ లో ఆత్మహత్య, నెల రోజుల్లో ఏం జరిగింది ?
Recommended Video
అందుకు వారు కూడా ఒప్పుకోవడం.. ఇద్దరూ మేజర్లు కావడంతో పోలీస్ స్టేషన్లోనే ప్రేమ జంటకు వివాహం జరిపించారు. ఇరువురి కుటుంబ సభ్యులు ఆ జంటను ఏమీ అనవద్దని పోలీసులు వారి పెద్దలకు సూచించినట్టు తెలుస్తోంది.