జనసేన కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్..! ఇంటర్ బోర్డ్ ముందు ఉాద్రిక్తం..!!
Recommended Video
హైదరాబాద్: ఇంటర్ ఫలితాల అవకతవకలపై నిరసన తెలపుతూ జనసేన పార్టీ సోమవారం ఇంటర్మీడియట్ బోర్డ్ ముట్టడికి పిలుపు ఇచ్చింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు భారీగా ఇంటర్ బోర్డు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కాగా నేడు ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడికి కార్యకర్తలు వచ్చిన వేళ పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. జనసేన తెలంగాణ ఇన్ చార్జ్ శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. పోలీసులు వారిని అడ్డుకున్న వేళ వాగ్వాదం జరిగింది. కార్యకర్తలను తరలించే ప్రక్రియలో భాగంగా పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చిందని పోలీసులు చెప్పుకొస్తున్నారు.

కాగా, తమపై లాఠీ చార్జ్ చేయడాన్ని శంకర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. పోలీసులను చూసి తాము వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని, ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకూ తాము పోరాడతామని స్పష్టం చేశారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ తో ఇంటర్ బోర్డు ముట్టడికి తెలంగాణ జనసేన నేత శంకర్ గౌడ్, కార్యకర్తలు ప్రయత్నించారు. జనసేన నేతలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం నెలకొనడంతో నేతలను అరెస్టు చేసిన పోలీసులు. అరెస్టు చేసిన నాయకులను గోషామహల్ పోలీసు స్టేషన్ కు తరలించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications