రోహిత్ ఆత్మహత్య బాధించింది, రాజకీయం మాని.. తల్లి శోకాన్ని అర్థం చేసుకోండి: మోడీ
లక్నో: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన వేముల రోహిత్ ఆత్మహత్య ఘటన పైన రాజకీయాలు వదిలి, ఆ తల్లి శోకాన్ని అర్థం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం లక్నోలో బిఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు.
రోహిత్ మృతి పైన ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేముల రోహిత్ ఆత్మహత్య తనను కలచివేసిందని చెప్పారు. ఆ తల్లి శోకాన్ని మనం అర్థం చేసుకుందామన్నారు. రోహిత్ కుటుంబానికి ప్రధాని మోడీ తన సంతాపాన్ని తెలిపారు.
రోహిత్ ఆత్మహత్య చేసుకునేంత బలహీనమైన పరిస్థితి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కాసేపు నివాళులు అర్పించారు. రోహిత్ మృతితో భారత దేశం ఓ ముద్దుబిడ్డను కోల్పోయిందన్నారు. అందరు రాజకీయాలను పక్కన బెట్టి బిడ్డను కోల్పోయిన తల్లి శోకాన్ని అర్థం చేసుకోవాలన్నారు.

ప్రతి వ్యక్తి సమున్నత స్థానానికి చేరుకోవాలని బాబా సాహెబ్ అంబేడ్కర్ కోరిక అన్నారు. డాక్టర్ అంబేడ్కర్ తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేశారని చెప్పారు. విద్యపట్ల స్పష్టమైన దూరదృష్టి ఉన్న వ్యక్తి అంబేడ్కర్ అన్నారు.
విద్య ద్వారా మనం ఏం చేయాలి, ఏం చేయకూడదన్నది తెలుస్తుందన్నారు. అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంబేడ్కర్ తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. మనం ఈ రోజు పొందుతున్న స్వేచ్ఛ, స్వాతంత్రం మన ముందు తరాల త్యాగఫలమని చెప్పారు. కల్పనను సాకారం చేసుకునే విధానం కఠినమైనదన్నారు.
-
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications