మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి: ఆధునిక భారత నిర్మాత అంటూ కేసీఆర్ ఘన నివాళి
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు ఘన నివాళుర్పించారు. ఈ సందర్బంగా పీవీ సేవలను కొనియాడారు. క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని కాపాడిన ఆధునిక భారతదేశ నిర్మాత అని వీపీని ప్రశంసించారు.
ప్రధానిగా పీవీ ప్రవేశపెట్టిన సంస్కరణలతో దేశం ఆర్థికంగానే కాకుండా అణుశక్తి, విదేశాంగ విధానం, అంతర్గత భద్రత వంటి రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించిందని తెలిపారు. దేశ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించిన పీవీకి దేశ ప్రజలంతా రుణపడి ఉంటారన్నారు.

దేశ ప్రధానిగా వినూతన విధానాలను అనుసరించి దేశ సంపదను గణనీయంగా పెంచిన పీవీ నర్సింహారావు స్ఫూర్తి.. తెలంగాణ ప్రభుత్వ కార్యాచరణలో ఇమిడి ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యాచరణ దేశానికి ఆదర్శంగా ఉందని అన్నారు.
తెలంగాణ నాయకత్వ దార్శనికత దేశానికి దిక్సూచిగా నిలుస్తుందనే విషయాన్ని పీవీ నిరూపించారని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బిడ్డగా పీవీ అందించిన స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు సీఎం కేసీఆర్.ఈ మేరకు సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో జూన్ 28, 1921లో పీవీ నర్సింహారావు జన్మించారు. ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా ఆయన ఎనలేని సేవలందించారు.
-
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications