గద్దర్ ప్రేమే పోరాటం: బాధగా ఉందంటూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తీవ్ర దిగ్భ్రాంతి గురిచేశారు. గద్దర్ మృతి చాలా బాధాకరమని అన్నారు. ఆయన మరణం తీరని లోటన్నారు. ఈ మేరకు ఇద్దరు నేతలు ట్విట్టర్ వేదికగా సంతాపం ప్రకటించారు.
గద్దర్ మృతి వార్త విని బాధలో మునిగిపోయినట్లు రాహుల్ గాంధీ చెప్పారు. ప్రజలపై గద్దర్కు ఉన్న ప్రేమే ఆయన్ను పోరాటం వైపు నడిపిందని రాహుల్ వ్యాఖ్యానించారు. గద్దర్ మార్గం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

'దిగ్గజ కవి, ఉద్యమకారుడు గుమ్మడి విట్టల్ రావు మరణవార్త విని బాధగా ఉంది. సామాజిక సమస్యల పట్ల ఆయన చూపిన అచంచలమైన అంకితభావం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటం నిజంగా స్ఫూర్తిదాయకం. గద్దర్ జీ శక్తివంతమైన పద్యాలు లక్షలాది మంది ఆకాంక్షలను ప్రతిధ్వనించాయి, మన హృదయాలపై చెరగని ముద్ర వేసాయి. ఆయన వారసత్వం మార్పు జ్వాలలను రగిలిస్తూనే ఉండనివ్వండి. ప్రశాంతంగా ఉండండి, గద్దర్ జీ..' ప్రియాంక గాంధీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
Saddened to hear about the demise of Shri Gummadi Vittal Rao, Telangana’s iconic poet, balladeer and fiery activist.
— Rahul Gandhi (@RahulGandhi) August 6, 2023
His love for the people of Telangana drove him to fight tirelessly for the marginalised. May his legacy continue to inspire us all. pic.twitter.com/IlHcV6pObs
గద్దర్ అకాల మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. గద్దర్ మృతికి భట్టి నివాళి అర్పించారు. సమాజ మార్పు కోసం తన ఆట, పాటతో పనిచేశారని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని గద్దర్ పాట ఉర్రూతలూగించిందని అన్నారు.
Saddened to hear about the passing of Shri Gummadi Vittal Rao garu, the iconic poet and relentless activist.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 6, 2023
His unwavering dedication to social causes and the fight for Telangana's statehood was truly inspiring. Gaddar ji's powerful verses echoed the aspirations of millions,… pic.twitter.com/Zaq7Ev7zv6
మరోవైపు, ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. ప్రజల సందర్శనార్థం ఎల్బీ స్టేడియంలో గద్దర్ పార్థీవ దేహం సోమవారం మధ్యాహ్నం వరకు ఉంటుందని తెలిపారు. గద్దర్ అభిమానులు, ప్రజలు.. గద్దర్ పార్థీవ దేహాన్ని చూడలనుకుంటున్నవారు ఎల్బీ స్టేడియానికి రావచ్చునని సీతక్క చెప్పారు. సోమవారం మధ్యాహ్నం తర్వాత గద్దర్ అంత్యక్రియలు జరగనున్నాయి.
గద్దర్ మృతి పట్ల భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్తో మంచి అనుబంధం ఏర్పడిందని.. తన పోరాటానికి ఆయన స్ఫూర్తి అన్నారు. ప్రజా సమస్యలపై ఆయన పోరాటం అజరామరమని, తనదైన పాటలతో ఎంతోమందిని ఉత్తేజ పరిచారన్నారు. తెలంగాణ ఉద్యమ గళం అయిన గద్దర్ స్మృతిలో.. ఆయనకు నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications