సారిక మృతి: పారిపోయిన అనిల్ రెండో భార్య సన ఖమ్మంలో అరెస్టు
వరంగల్/ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతి కేసులో ఏ4 నిందితురాలుగా ఉన్న సనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సనను ఖమ్మంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించవలసి ఉంది. రాజయ్య తనయుడు అనిల్.. సారికను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత అనిల్.. సనతో వివాహేతర సంబంధం పెట్టుకొని, ఆ తర్వాత రెండో వివాహం చేసుకున్నాడు.

మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, భార్య మాధవి, కుమారుడు అనిల్ వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్నారు. సారికది ఆత్మహత్యేనని పోలీసులు రిమాండ్ నివేదికలో పొందుపరిచారు. అత్తమామ, భర్త అనిల్, సన వేధింపుల వల్లనే సారిక తన ముగ్గురు పిల్లలతో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. సిలిండర్ను తన గదిలోకి తీసుకెళ్లి లీక్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications