జంప్ జిలానీలదే హడావుడి: రావుల, కాంగ్రెస్ నేతలవి చిల్లర రాజకీయాలు: కర్నె
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించిన ఆయుత చండీయాగం వద్ద ఇతర పార్టీల నుంచి ఫిరాయించిన నేతలే ఎక్కువ హడావుడి చేశారని తెలంగాణ టీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాకుండా పోలింగ్ సమయంలో కూడా టీడీపీకి చెందిన వారిని ఎత్తుకుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదువు కూడా సరిగా రాని ఎంపీటీసీలు ఫైవ్ స్టార్ హోటళ్లలో కూర్చొని ఏం చేస్తారో ఎన్నికల ప్రధాన అధికారికి తెలియదా? అంటూ ప్రశ్నించారు. మంత్రులు కేటీఆర్, హరీష్రావులు ఫిరాయింపుల యాగం చేశారని ధ్వజమెత్తారు. యాగం పూర్తయిందని, యాగం మూడ్ నుంచి బయటకు వచ్చి, పాలనపై దృష్టిసారించాలని కేసీఆర్కు ఆయన హితవు పలికారు.
హైదరాబాద్లో సమాధి రాళ్లు వేశారు: కర్నె

కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాలని ఆయన నిలదీశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం పునాది రాళ్లు వేస్తోంటే, కాంగ్రెస్ నేతలు హైదరాబాద్లో సమాధి రాళ్లు వేశారని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి వేషాలు మానుకుని ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి పనులకు సహకరించాలని ఆయన హితవు పలికారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications