జానారెడ్డికి సీఎం రేవంత్ కీలక బాధ్యతలు- దిగ్విజయ్ రీ ఎంట్రీ..!!

తెలంగాణ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. అటు స్థానిక సంస్థల ఎన్నికల దిశగా ప్రభుత్వం లో కసరత్తు కొనసాగుతోంది. ఇటు మంత్రివర్గం- పీసీసీ విస్తరణ పైన తుది నిర్ణయం జరగలేదు. ఈ సమయంలో అనూహ్యంగా సీనియర్ నేత జానారెడ్డికి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ కీలక మంత్రాం గం చేసారు. జానారెడ్డి అనుభవం వినియోగించుకోవాలని డిసైడ్ అయ్యారు. కొత్త బాధ్యతలు అప్పగించారు. ఈ ఎపిసోడ్ లో కాంగ్రెస్ ముఖ్య నేత దిగ్విజయ్ సింగ్ కీలక పాత్ర పోషించారు.

జానా తో రేవంత్ భేటీ
ముఖ్యమంత్రి రేవంత్ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో కీలక మంత్రాంగం చేసారు. శాంతి చర్చల దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆపరేషన్ కగార్, శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో సీఎం చర్చించారు. తాజాగా సీఎం రేవంత్‌తో శాంతి చర్చల కమిటీ తెలంగాణ నేతలు భేటీ అయ్యారు. కాల్పుల విరమణ, శాంతి చర్చల అంశం పై జానారెడ్డి సలహాలు తీసుకుంటామని సీఎం తెలిపారు. అందులో భాగంగానే శాంతి చర్చలపై సీఎం రేవంత్, జానారెడ్డి, కేకే, వేం నరేందర్ రెడ్డి చర్చించారు. అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌తో సీఎం ఫోన్లో మాట్లాడారు. గతంలో ఏపీ పార్టీ ఇంచార్జీగా దిగ్విజయ్ సింగ్ ఉన్న సమయంలోనే శాంతి చర్చలు జరిగాయి.

revanth-key-responsibilities-for-jana-reddy-as-digvijay-singh-suggestions

జానా అనుభవంతో
శాంతి చర్చలు, కాల్పుల విరమణకు సంబంధించి జానా రెడ్డికి మంచి అనుభవం ఉంది. గతంలో చర్చలు జరిగిన సమయంలో జానా రెడ్డి హోంమంత్రిగా ఉన్నారు. చర్చల్లో జానారెడ్డి చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత సలహాలు, సూచనలు తీసుకుంటామని శాంతి చర్చల కమిటీకి సీఎం తెలిపారు. ఇందులో భాగం గానే జానారెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఈ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఆపరేషన్ కగార్‌పై సీఎం జానారెడ్డితో పాటుగా కేశవ రావు సేవలు వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ వెల్లడించారు. కాగా, బీఆర్ఎస్ సభలోనూ మాజీ సీఎం కేసీఆర్ ఇదే అంశం పైన తన అభిప్రాయం వెల్లడించారు. శాంతి చర్చలు జరగాలని మావోయిస్టులు డిమాండ్ చేస్తున్నారని, శాంతి చర్చలు జరపాలని..కాల్పుల విరమణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

రేవంత్ స్పందన
ఈ అంశానికి సంబంధించి పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నేతగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని సభలో కేసీఆర్ ప్రకటించారు. సీఎం రేవంత్ సైతం మావోయిస్టుల సమస్యను శాంతిభద్రతల అంశంగా పరిగణించడం లేదని, ఇదొక సామాజిక అంశంగా పరిగణిస్తున్నామని తెలిపారు. మావోయిస్టులు డిమాండ్ చేస్తున్న శాంతి చర్చలు, కాల్పుల విరమణపై తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకున్నట్లైతే మిగిన రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా దీని ప్రభావం పడనుంది. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా త్వరితగితిన స్పందిస్తే శాంతి చర్చల అంశం తెరమీదకు రానుంది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉండటంతో శాంతి చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు తమ వద్దకు వచ్చిన ప్రతిపాదనలు పార్టీ అధినాయకత్వానికి నివేదిస్తామని రేవంత్ స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+