సభతో ఆత్మరక్షణలో టీఆర్ఎస్: రేవంత్, దుమ్ముదులిపిన డీకే అరుణ
మహబూబ్ నగర్: టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభపై కాంగ్రెస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డి, డీకే అరుణలు సోమవారం నిప్పులు చెరిగారు. ప్రగతి నివేదన సభతో తెలంగాణ రాష్ట్ర సమితి ఆత్మరక్షణలో పడిందని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మంగళవారం అన్నారు. కొంగర్ కలాన్ సభ అట్టర్ ప్లాప్ అయిందన్నారు.
Recommended Video

ప్రగతి నివేదన సభకు 25 లక్షల మందిని పిలుస్తామని చెప్పారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. కానీ ఈ సభకు రెండున్నర లక్షల మంది కూడా రాలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బిగ్ షో చేయాలనుకున్నారని, కానీ అది ఫ్లాప్ షోగా మారిందన్నారు. టీఆర్ఎస్ సర్కార్ ఖేల్ ఖతం అయిందన్నారు.

సభ ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇచ్చారో చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రసంగంలో ఎలాంటి జోష్ లేదన్నారు. నిరుద్యోగులకు, దళితులకు ఏం చేశారో చెప్పలేదన్నారు. తెరాస సర్కారును ఇంటికి పంపించేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ముందస్తు ఎన్నికలపై కేసీఆర్కే స్పష్టత లేదన్నారు. రెండో విడత రైతు బంధు చెక్కులు ఇచ్చాకే ఎన్నికలకు పోవాలనుకుంటున్నారని విమర్శించారు.
కేసీఆర్కు ప్రధాని నరేంద్ర మోడీతో లోపాయికారి ఒప్పందం ఉందని చెప్పారు. ఇక్కడ మోడీని తిడతారని, ఢిల్లీకి వెళ్లి ఆయన కాళ్లపై పడతారని దుయ్యబట్టారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీదే గెలుపు అన్నారు. ఈ నెల 12న లేదా 15న మహబూబ్ నగర్లో బీజేపీ ఎన్నికల శంఖారావం ఉంటుందన్నారు.
-
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications