కేసీఆర్కు రేవంత్ ఝలక్: అసలు ఎలా తీసుకుంటారు.. హైకోర్టులో పిటిషన్
శాసన సభ నుంచి తమను బడ్జెట్ సమావేశాలకు మొత్తం సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మంగళవారం నాడు హైకోర్టును ఆశ్రయించారు.
హైదరాబాద్: శాసన సభ నుంచి తమను బడ్జెట్ సమావేశాలకు మొత్తం సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మంగళవారం నాడు హైకోర్టును ఆశ్రయించారు.
గవర్నర్ ప్రసంగానికి ఆటంకం కలిగిస్తున్నారన్న కారణంతో సస్పెండ్ చేయడం రాజ్యాంగ విరుద్దమని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం సభ పరిధిలోకి రాదని, గవర్నర్ ప్రసంగం పూర్తయ్యాకే సభ ప్రారంభమవుతుందన్నారు.

గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగే ఘటనలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం చట్ట విరుద్ధమన్నారు. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని, వాటిలో ఎక్కడా సభ్యుల సస్పెన్షన్ ప్రస్తావనే లేదన్నారు. తనపై సస్పెన్షన్ను చట్ట విరుద్ధంగా ప్రకటించిన ఆ ఉత్తర్వులను కొట్టివేయాలని కోర్టును కోరారు.












Click it and Unblock the Notifications