రేవంత్ సర్కారుకు కేంద్రం మరో గుడ్న్యూస్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కారుకు మరో తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో రీజినల్ రింగ్రోడ్డు(RRR) దక్షిణ భాగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని ఇప్పటికే జాతీయ రహదారిగా కేంద్రం ప్రకటించింది. తాజాగా మంగళవారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమావేశమైన అనంతరం దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు కోరాలని నితిన్గడ్కరీ ఎన్హెచ్ఐఏ అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు రీజినల్ రింగ్ రోడ్ దక్షిణ భాగమైన చౌటుప్పల్- ఆమన్గల్- షాద్నగర్, సంగారెడ్డి పరిధిలోని 182 కిలోమీటర్ల జాతీయ రహదారి పనులకు అడ్డంకులు తొలిగిపోయాయి. ఆర్ఆర్ఆర్ అంశంతో పాటు రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు అనుమతి, పలు ముఖ్యమైన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్-విజయవాడ ఆరు వరుసలు, హైదరాబాద్-కల్వకుర్తి నాలుగు వరుసలతో పాటు మరికొన్నింటికి అనుమతి ఇవ్వాలని సీఎం కోరారు. సీఎం రేవంత్ విజ్ఞప్తులకు కేంద్రమంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కాగా, తొలుత రీజినల్ రింగు రోడ్డు దక్షిణ భాగంలో కరెంటు స్తంభాలు, భవనాలు సహా తదితరాల తొలగింపునకు సంబంధించిన వ్యయం విషయంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనపై చర్చసాగింది.
యుటిలిటిస్ తరలింపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని 10 నెలల క్రితం భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అందుకు రాష్ట్రం అనుమతి తెలుపకపోవడంతో ఈ విషయంలో ప్రతిష్ఠంభన నెలకొంది. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని భరించేందుకు సమ్మతిస్తూ ఎన్హెచ్ఐఏకు లేఖ పంపారు.
📍 𝓝𝓮𝔀 𝓓𝓮𝓵𝓱𝓲
— Office Of Nitin Gadkari (@OfficeOfNG) February 20, 2024
Telangana Chief Minister Shri @revanth_anumula Ji called on Union Minister Shri @nitin_gadkari Ji in New Delhi today. They discussed the progress of ongoing National Highway projects in the state of Telangana. pic.twitter.com/YBgUBO6j0u
ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి గడ్కరీ వద్ద ప్రస్తావించగా.. ఆయన ఈ అంశంపై ఎన్హెచ్ఐఏ అధికారులను ఆరా తీశారు. యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని రాష్ట్రప్రభుత్వమే భరించాలని మెలిక పెట్టిందెవరంటూ అధికారులపై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక, ఒకవేళ రాష్ట్రప్రభుత్వం ఆ వ్యయాన్ని భరిస్తే భవిష్యత్లో టోల్ ఆదాయంలో సగం రాష్ట్ర సర్కారుకి చెల్లించాల్సి ఉంటుందన్నారు. అందువల్ల యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని తామే భరిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.
ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్కు(RRR) సంబంధించిన భూసేకరణ, విధానపరమైన ప్రక్రియలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి గడ్కరీ సూచించారు. కేంద్రమంత్రితో జరిగిన సమావేశంలో సీఎం వెంట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
-
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
ఆర్టీవో ఆఫీసులకు తిరిగే పని లేకుండా తెలంగాణా వాహనదారులకు సీఎం రేవంత్ శుభవార్త! -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !! -
విశాఖ-ఢిల్లీ ఇండిగో ఫ్లైట్ లో తీవ్ర సాంకేతిక లోపం: ఎయిర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ విధింపు -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications