బాబువల్లే పీవీకి, ఇస్తానన్న కేసీఆర్ కక్కుర్తితో: రేవంత్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి బుధవారం మండిపడ్డారు. దివంగత నేత పీవీ నర్సింహా రావుకు దేశ రాజధాని న్యూఢిల్లీలో స్మారక స్థూపం తమ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతోనే సాధ్యమైందని చెప్పారు.
కేసీఆర్ సెంటిమెంటును అడ్డు పెట్టుకొని పాలన చేస్తున్నారని విమర్శించారు. 550 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారిని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోలేదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ నుండి కరెంట్ ఇస్తామని చంద్రబాబు చెప్పినప్పటికీ కమీషన్కు కక్కుర్తిపడి ప్రయివేటు సంస్థల నుండి ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.
భూ కబ్జాదారులే గెలిచారు: సీతక్క

భూకబ్జాలకు పాల్పడిన వారే ఎమ్మెల్యేలుగా గెలిచారని, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఉదంతమే ఇందకు నిదర్శనమని టీడీపీ నేత సీతక్క వరంగల్ జిల్లాలో అన్నారు. మిషన్ కాకతీయ పేరుతో శిఖం భూములను క్రమబద్ధీకరించి కాజేయాలని చూస్తున్నారని సీతక్క ఆరోపించారు.
12 నుంచి తెలుగు రాష్ట్రాల్లో నారా లోకేశ్ పర్యటన
ఈనెల 12 నుంచి తెలుగు రాష్ట్రాల్లో నారా లోకేశ్ పర్యటన ఉండనుంది. పర్యటనలో భాగంగా యువనేత లోకేశ్ పలు ప్రమాదాల్లో మృతిచెందిన 50 మంది కార్యకర్తల కుటుంబాలకు రూ.2 లక్షల బీమా చెక్కులు అందించనున్నారు.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications