లాయర్లు లేట్: ఈ రాత్రికి జైల్లోనే ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి
హైదరాబాద్: దేవుడు కరుణించినా పూజారి వరమివ్వలేదని సామెతగా తయారైంది టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పరిస్ధితి. ఓటుకు నోటు కేసులో హైకోర్టు బెయిల్ మంజారు చేసినా, రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు సరైన సమయంలో ష్యూరిటీలను సమర్పించకపోవడంతో మరో జైలులోనే గడపాల్సిన పరిస్ధితి వచ్చింది.
దీంతో జైలు నుంచి విడుదల అయ్యేందుకు మరో రోజు వేచి ఉండక తప్పేలా లేదు. హైకోర్టు రూ. 5 లక్షల వ్యక్తిగత పూచీ కత్తుతో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజారు చేసిన సంగతి తెలిసిందే. జైలు నుంచి ఖైదీలను సాయంత్రం 6 గంటలలోగా విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ లోపే లాంఛనాలన్నీ పూర్తి చేయాల్సి ఉంటుంది.

అయితే, హైకోర్టు నుంచి బెయిల్ పేపర్లు ఏసీబీ కోర్టుకు చేరుకున్నా, రేవంత్ తరఫు న్యాయవాదులు తగిన సమయంలో ష్యూరిటీ పేపర్లు సమర్పించ లేకపోయారు. దీంతో మంగళవారం రాత్రంతా జైలులోనే రేవంత్ రెడ్డి గడపాల్సిన పరిస్ధితి వచ్చింది.
బుధవారం ఉదయాన్నే రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలు నుంచి విడుదల కానున్నారు. దాదాపు నెల రోజులుగా జైలులో ఉండి, బెయిల్పై విడుదలవుతున్న తమ నాయకుడికి స్వాగతం పలికేందుకు కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఈ రోజు రేవంత్ విడుదల కారన్న సమాచారంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్ర నిరాశకు లోనయ్యారు.
ఏసీబీ కోర్టుకు రేవంత్ బెయిల్ పేపర్లు
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మంజూరైన బెయిల్ కాపీ ఏసీబీ కోర్టుకు చేరుకుంది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి రాష్ట్ర హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే రేవంత్ బెయిల్ కాపీని ఏసీబీ కోర్టుకు అందజేశారు.
అనంతరం రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు సరైన సమయంలో ష్యూరిటీలను సమర్పించడంలో విఫలమయ్యారు. దీంతో రేవంత్ రెడ్డి విడుదల ఆలస్యం అయింది. ఈ బెయిల్ కాపీని రేవంత్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నచర్లపల్లి జైలుకు పంపనున్నారు.
-
బాసరలో వీఐపీ వాహనాలకు సైతం నో ఎంట్రీ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications