కెసిఆర్ మైండ్ గేమ్.. ఎర్రబెల్లి లేఖపై రేవంత్ ఆగ్రహం: బాబుతో అత్యవసర భేటీ!
హైదరాబాద్: తమను అసలైన టిడిపి సభ్యులుగా గుర్తించాలంటూ సభాపతి మధుసూదనా చారికి పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు రాసిన లేఖ పైన తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. సభాపతికి ఎర్రబెల్లి లేఖ నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ పైన చర్చించేందుకు తెలంగాణ టిడిపి సభ్యులు జాతీయ అధ్యక్షులు చంద్రబాబుతో భేటీ కానున్నారు.

ఎర్రబెల్లి ఏకపక్షంగా లేఖ రాశారని రేవంత్ రెడ్డి మండిపడుతున్నారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి, మిగిలిన టిడిపి సభ్యులు శుక్రవారం నాడు సభాపతిని కలిసే అవకాశముందని తెలుస్తోంది. అంతకుముందే చంద్రబాబుతో భేటీ కానున్నారు.
కాగా, తమను అసలైన టిడిపిగా గుర్తించాలని ఎర్రబెల్లి దయాకర రావు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖలో ఎర్రబెల్లి సహా తెరాసలో చేరిన ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. కేపీ వివేకానంద, సాయన్న, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, మాధవరం కృష్ణారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజేందర్ రెడ్డిలు సంతకం చేశారు.
-
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది!












Click it and Unblock the Notifications