తీహార్ జైలులో కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సీబీఐకు అనుమతి లభించింది. తీహార్ జైలులో కవితను ప్రశ్నించేందుకు రౌస్ అవెన్యూ కోర్టును సీబీఐ సంప్రదించింది. ఈ మేరకు కోర్టు ఆమెను ప్రశ్నించేందుకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది.
ప్రశ్నించటానికి ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కవితను ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని షరతు విధించింది. ప్రశ్నించే సమయంలో ల్యాప్టాప్, ఇతర స్టేషనరీకి తీసుకువచ్చేందుకు సీబీఐకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి మంజూరు చేసింది. అలాగే విచారణలో ఉన్న నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది.

ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి గత డిసెంబర్ నెలలో హైదరాబాద్లోని కవిత నివాసంలోనే సీబీఐ అధికారులు ఆమెను మూడు రోజులపాటు విచారించిన విషయం తెలిసిందే. అయితే, అవసరమైన మరింత సమాచారం కోసం ఆమెను మరోసారి విచారించాలని సీబీఐ భావించింది. ఈ క్రమంలోనే కోర్టు అనుమతి రావడంతో వచ్చే వారమే సీబీఐ అధికారులు కవితను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో తాము నమోదు చేసిన వాంగ్మూలం, అప్రూవర్గా మారినవాళ్లు, ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కవితను ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం. కవితను ప్రశ్నించిన కొంత సమాచారం రాబట్టిన తర్వాత సీబీఐ ఈ కేసులో మరో ఛార్జీషీటు దాఖలు చేసే అవకాశం ఉంది.
ఢిల్లీ లిక్కర్ కేసులో పెద్ద మొత్తంలో ముడుపులు చేతులు మారాయని, లిక్కర్ పాలసీ విధానం రూపొందించి ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధిచేకూరేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సీబీఐ మొదట కేసు నమోదు చేసింది. అయితే, ఈ కేసులో మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. పదిరోజులపాటు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. విచారణ ముగియడంతో ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలోనే కవితను మరోసారి ప్రశ్నించేందుకు సీబీఐ కోర్టు నుంచి అనుమతి తీసుకుంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications