RS Praveen Kumar: ఎర్రబెల్లి దయాకర్ రావును ఎన్నికల్లో పోటీ చేయనివ్వొద్దు..
సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఎన్నికల్లో పోటీ చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించాలని డిమాండ్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే గడువులోగా పథకాలన్నింటిని తమకు ఓట్లు వేసే వారికే విడుదల చేయాలని అని మంత్రి ఎర్రబెల్లి చెప్పడం దారుణమన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు తన మంత్రి పదవిని దుర్వినియోగం చేశారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
ఎర్రబెల్లి వ్యాఖ్యల వెనకాల సీఎం కేసీఆర్ ఉన్నారని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో పలువురు నాయకులు బీఎస్పీలో జాయిన్ అయ్యారు. పోలీసులను చేతిలో పెట్టుకుని కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జగదీశ్ రెడ్డి తనకు అనుకూలమైన పోలీసులు నియమించుకున్నారని విమర్సించారు. వందల కోట్ల డబ్బులు పంచినా ఎవరూ పట్టుకోలేదన్నారు.

మరోవైపు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తల మీద మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొట్టారు. ఇందుకు సంబంధంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎర్రబెల్లి దయాకర్ రావు తల మీద కొట్టిన ఘటన మీద షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వివరణ ఇచ్చారు. ఎర్రబెల్లి తనను ఎంతో బాగా చూసుకుంటారని చెప్పారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications