వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సండ్ర బెయిల్ షరతుల సడలింపు: సెబాస్టియన్, మత్తయ్యల వాయిస్ శాంపిల్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సమావేశానికి హాజరయ్యేందుకు తెలుగుదేశం పార్టీ తెలగాణ శాసనసభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్టు సభ్యుడు సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ ప్రత్యేక కోర్టు బుధవారం అనుమతించింది.

దీంతో గురు, శుక్రవారాల్లో తిరుపతిలో జరుగనున్న సమావేశాలకు సండ్ర హాజరుకానున్నారు. ఓటుకు నోటు కేసులో అరెస్టయిన సండ్రకు బెయిల్ మంజూరు సమయంలో నియోజక వర్గం విడిచి వెళ్లరాదంటూ కోర్టు షరతులు విధించిన విషయం తెలిసిందే.

Sandra's bail conditions relaxed to attend TTD board meeting

ఓటుకు నోటు కేసులో నిందితులు సెబాస్టియన్, మత్తయ్యల వాయిస్ శాంపిళ్లను టీవీ చానళ్ల నుంచి సేకరించిన ఏసీబీ అధికారులు బుధవారం ఏసీబీ ప్రత్యేక కోర్టులో సమర్పించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు వారిద్దరి ఇంటర్వ్యూ టేపులు ఇవ్వాలని కోరుతూ సంబంధిత టీవీ చానళ్ల యాజమాన్యాలకు లేఖలు రాశారు.

ఆ సీడీలను ఎఫ్‌ఎస్‌ఎల్‌కి పంపించేందుకు అనుమతించాలని కోరుతూ ఏసీబీ అధికారులు బుధవారం కోర్టుకు సమర్పించారు. తాజాగా, తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ డ్రైవర్ కొండల్ రెడ్డికి తెలంగాణ ఎసిబి అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

English summary
Accused in cash for vote case and Telugu Desam party Telangana MLA Sandra Venkata Veeraiah's bail conditions have been relaxed by ACB special court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X