ఇంట్లో సీఐ మసాజ్ బాగోతం: కమిషనర్ సీరియస్, వీడియో వైరల్
సరూర్ నగర్ సీఐ లింగయ్య తన స్టేషన్లో హోంగార్డుతో మసాజ్ చేయించుకున్న బాగోతంపై రాచకొండ కమిషనర్ సీరీయస్ అయ్యారు. కమిషన్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్: సరూర్ నగర్ సీఐ లింగయ్య తన స్టేషన్లో హోంగార్డుతో మసాజ్ చేయించుకున్న బాగోతంపై రాచకొండ కమిషనర్ సీరీయస్ అయ్యారు. కమిషన్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
దీనిపై దర్యాఫ్తు జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని డీసీపీ (అడ్మిన్) ప్రకాశ్ రెడ్డిని సంఘటనపై విచారణ అధికారిగా నియమించారు.

సీఐగా పని చేస్తున్న లింగయ్య వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. స్టేషన్లో పని చేసే హోంగార్డుతో ఇంటి వద్ద బాడీ మసాజ్ చేయించుకుంటున్న దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి.
మన్సూరాబాద్లోని ఇంటి వద్ద సీఐ లింగయ్య యూనిఫాంలో ఉన్న హోంగార్డు సైదా నాయక్తో బాడీ మసాజ్ చేయించుకున్న దృశ్యాలు ఉన్నాయి. ఇవి మీడియాలో ప్రసారం కావడంతో ఆ దృశ్యాల్లో ఉన్నది తాను కాదని, తనకు మసాజ్ చేయించుకోవడం గానీ, మద్యం సేవించే అలవాటు గానీ లేదని లింగయ్య చెప్పారు.
సైదా నాయక్ అనే హోంగార్డు అక్టోబర్ 14న రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో సెలవులో ఉన్నాడని, అనంతరం ఇక్కడి నుంచి బదలీపై వెళ్లాడని లింగయ్య చెప్పారు. మూడు నెలలుగా సరూర్ నగర్లో హోంగార్డు లేడని చెప్పారు. తనపై గిట్టని వాళ్లు ఈ దుష్ప్రచారం చేశారన్నారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో వైరల్ అవుతోంది.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications