‘సత్యం’ స్కాం: రామలింగరాజు, మరో ముగ్గురిపై 14ఏళ్లపాటు నిషేధం, రూ.813కోట్లు చెల్లించండి: సెబి
న్యూఢిల్లీ: దాదాపు పదేళ్ల కిందటి సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో సెక్యూరిటీస్ ఎక్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబి) సంచలన ఆదేశాలు జారీ చేసింది. చట్టవిరుద్ధంగా ఆర్జించిన రూ.813కోట్లను తిరిగి చెల్లించాలంటూ 'సత్యం' కంపెనీ వ్యవస్థాపకుడు రామలింగరాజు తోపాటు ఆయన సోదరులు రామరాజు, సూర్యనారాయణరాజు, ఎస్ఆర్ఎస్ఆర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్లను సెబి ఆదేశించింది.
అంతేగాక, 14ఏళ్లుపాటు సెక్యూరిటీస్ మార్కెట్ కార్యకలాపాల్లో పాలుపంచుకోకుండా వీరిపై నిషేధం విధించింది. అయితే, ఈ 14ఏళ్ల నిషేధ కాలంలో ఇప్పటికే పూర్తయిన కాలం కూడా కలిసి ఉంటుంది. సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యూనల్ సూచనల ప్రకారం సెబి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

కాగా, గతంలో ఆదేశించిన రూ.1,258.88 కోట్ల మొత్తాన్ని తాజాగా రూ.813.40కోట్లకు తగ్గించింది. ఇందులో ఎస్ఆర్ఎస్ఆర్ హోల్డింగ్స్ రూ.675కోట్లు, రామలింగ రాజు దాదాపు రూ.27కోట్లు, సూర్యనారాయణ రాజు రూ.82కోట్లు, రామరాజు సుమార రూ.30కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. సత్యం కుంభకోణం వెలుగులోకి వచ్చిన 2009, జనవరి 7 నుంచి 12శాతం వార్షిక వడ్డీరేటుతో 45రోజుల్లోగా ఈ మొత్తాన్ని చెల్లించాలి.
-
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications