లష్కరే తొయిబా ఉగ్రవాది అజీజ్ అరెస్ట్: ప్రశ్నిస్తున్న తెలంగాణ పోలీసులు
లక్నో/హైదరాబాద్: ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా కమాండర్ అబ్దుల్ అజీజ్ను లక్నోలో ఉత్తరప్రదేశ్లో ఏటీఎస్ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్కు చెందిన అజీజ్.. నగరంలోని రెండు కేసుల్లో నిందితుడు.
గణేశ్ ఆలయం పేల్చివేత కుట్ర కేసులో అజీజ్ ప్రధాన నిందితుడు. 2003లో బెయిల్పై విడుదలైన అజీజ్ సౌదీకి పారిపోయాడు. సౌదీ ప్రభుత్వ వెనక్కి పంపడంతో తిరిగి లక్నో చేరుకున్న అజీజ్ను ఏటీఎస్ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అజీజ్ను లక్నోలో తెలంగాణ పోలీసులు ప్రశిస్తున్నారు.

కాగా, గణతంత్ర దినోత్సవంలో బీభత్సం సృష్టించేందుకు కుట్రలు పన్నిన 13మంది అనుమానిత ఉగ్రవాదులను దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్ఐఏ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా సాగాయి.
బెంగళూరు, తంకూరు, మంగళూరు, హైదరాబాద్, ముంబై, లక్నో నగరాల్లో స్థానిక పోలీసుల సహాయంతో ఎన్ఐఏ అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. వీరంతా జనూద్ ఉల్ ఖలీఫా ఈ హింద్(భారత ఆర్మీ ఖలీఫా)కు చెందినవారని, ఇది కూడా ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ లాగే పని చేస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications