ఆంధ్రా ఉద్యోగులకు పోస్టింగ్స్ ఇవ్వకపోతే జైలుకే- కేసీఆర్ సర్కార్ కు సుప్రీం లాస్ట్ వార్నింగ్
ఏపీ విభజన తర్వాత తెలంగాణకు వచ్చిన ఉద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం పోస్టింగ్స్ ఇవ్వకుండా కాలయాపన వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇవాళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించి జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తెలంగాణ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ నుంచి రిలీవ్ అయిన 84 మంది విద్యుత్ ఉద్యోగులకు తక్షణమే పోస్టింగ్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
గతంలో ఏపీ-తెలంగాణ విభజన సందర్భంగా జస్టిస్ ధర్మాధికారి కమిటీ నివేదిక ఇచ్చింది. దాని ప్రకారమే ఉద్యోగుల విభజన జరిగింది. అయితే ఈ నివేదిక ప్రకారం తెలంగాణకు వచ్చిన 84 మంది విద్యుత్ ఉద్యోగులకు పోస్టింగ్స్ ఇచ్చేందుకు కేసీఆర్ సర్కార్ కొంతకాలంగా నిరాకరిస్తూ వస్తోంది. దీంతో వారు తొలుత హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అయితే సుప్రీంకోర్టు ఆదేశించినా తెలంగాణ సర్కార్ వెనక్కి తగ్గలేదు. దీంతో ఇవాళ మరోసారి ఇదే అంశంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కేసీఆర్ సర్కార్ కు ఈ విషయంలో చివరి అవకాశం ఇస్తున్నామని తెలిపింది. 2 వారాల్లోగా జస్టిస్ ధర్మాధికారి నివేదికను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నివేదిక అమలు అయ్యిందా?, లేదా? అన్న విషయంపై ఈ నెల 31న మరోమారు సమీక్ష చేపట్టనున్నట్లు తెలిపింది.
ఇవాళ విచారణ సందర్భంగా ఏపీ విద్యుత్ ఉద్యోగులు తమకు జరుగుతున్న అన్యాయంపై సుప్రీంకోర్టుకు మొరపెట్టుకున్నారు. కోర్టుల ఆదేశాలను తెలంగాణ సర్కారు అమలు చేయడం లేదని ఈ సందర్భంగా ఉద్యోగులు ధర్మాసనానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే కోర్టుల ఆదేశాలు ఉల్లంఘించారంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కోర్టు ధిక్కరణ కింద విద్యుత్ శాఖ అధికారులకు జైలు శిక్షే పరిష్కారమని వ్యాఖ్యానించింది. 84 మంది ఉద్యోగులకు పోస్టింగ్లు ఇచ్చేందుకు చివరి అవకాశం ఇచ్చింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications