హైదరాబాద్ లో విస్తరిస్తున్న ప్రాణాంతక వ్యాధి.. తొలి మరణం..!
హైదరాబాద్ లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. భాగ్యనగరంలో ప్రాణాంతక స్క్రబ్ టైఫస్ వ్యాధి విజృంభిస్తోంది. ఇది పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్యులు చెబుతున్నారు. ఇదే వ్యాధితో గత కొన్ని రోజులుగా నిలోఫర్ ఆసుపత్రిలో కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. దీంతో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకోవాలని వివరిస్తున్నారు. మరోవైపు ఏపీలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్క్రబ్ టైఫస్ జ్వరంతో గవ్వల మధు అనే యువకుడు మృతి చెందడం కలకలం రేపుతోంది. కొత్త రకం జ్వరంతో యువకుడు మృతి చెందడంతో స్థానిక ప్రజల్లో ఆందోళన కలుగుతోంది.
వర్షాకాలంలో భాగ్యనగరంలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. చిన్నపిల్లలే టార్గెట్ గా ప్రాణాంతక స్క్రబ్ టైఫస్ వ్యాధి విజృంభిస్తోంది. వ్యాధి తీవ్రత పెరుగుతున్న క్రమంలో నగరంలోని ఆస్పత్రులు నిండిపోతున్నాయి. దాదాపు అన్నీ ఇలాంటి కేసులే నమోదవుతున్నాయి. నీలోఫర్ ఆస్పత్రిలో కేసులు విపరీతంగా పెరుగుతున్నట్లు అక్కడి వైద్యులు చెబుతున్నారు. వ్యాధి విషమించిన చిన్నారులను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
అటు ఏపీలోనూ ఈ వ్యాధి విస్తరిస్తోంది. ఏపీలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్క్రబ్ టైఫస్ జ్వరంతో గవ్వల మధు అనే యువకుడు మృతి చెందడం కలకలం రేపుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో తొలి మరణం నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రాణాంతక స్క్రబ్ టైఫస్ వ్యాధి చిన్న పిల్లలపైనే ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నారు.

స్క్రబ్ టైఫస్ అనేది ఓరియంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల కలిగే ఒక తీవ్రమైన వ్యాధిగా చెప్పవచ్చు. ఈ బ్యాక్టీరియాను చిగ్గర్ లేదా లార్వల్ మైట్ అని పిలవబడే చిన్న పురుగులు మోసుకెళ్తాయి. ఇక ఈ జ్వరం బారిన పడినవారిలో తీవ్రజ్వరం, చలి, విపరీతమైన తలనొప్పి, దగ్గు జలుబు, ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పి, శరీరంపై దురద, ఎర్రని మచ్చలు, కళ్ల మంట, కోమా వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. సకాలంలో రోగ నిర్ధారణ, యాంటీబయాటిక్ చికిత్స ప్రాణాంతక సమస్యలను నివారించడానికి చాలా ముఖ్యం అని వైద్యులు చెబుతున్నారు.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications