లోక్ సభ ఎన్నికల్లో గెలుపుగుర్రాల వేట..! అమీత్ షాతో భేటీ ఐన టీ బీజేపి నేతలు..!!
హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల వ్యూహం పై రాష్ట్ర బీజేపి ద్రుష్టి సారించింది. అందులో భాగంగా లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థులు, నియోజక వర్గాలపై కసరత్తు ప్రారంభించింది. బీజేపీ కి అనుకూలంగా ఉన్న లోక్ సభ నియోజక వర్గాలపైన ఎక్కువగా ద్రుష్టి కేంద్రీకరిస్తే గెలిచి తీరుతామని బీజేపి రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే లోక్ సభ నియోజక వర్గాలను క్లస్టర్లుగా విభజించిన బీజేపి, ఆయా స్థానిక నేతలో సంప్రదింపులు జరుపుతోంది.
నకిలీ IAS ఘనకార్యం..! నిరుద్యోగులే టార్గెట్ గా 6 కోట్ల మోసం..!!
బలమైన బీజేపి అభ్యర్తులను ఢీకొట్టేందుకు ప్రధాని మోదీ అభివ్రుద్ది మంత్రంతో తో పాటు రాష్ట్రానికి వివిధ రూపాల్లో ఇస్తున్న నిధుల వివిధ వివిరాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని బీజేపి రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అందులో భాగంగా బీజేపి జాతీయ అద్యక్షుడు అమీత్ షా తో సమావేశమై రాష్ట్ర రాజకీయాలు గురించి, లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించారు.
లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవడంతో బీజేపీ 'గెలుపు' కసరత్తు మొదలెట్టింది. జాతీయ నేతల పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర నేతలు పార్టీ చీఫ్ అమిత్ షాతో భేటీ అయ్యారు . రాష్ట్రంలో పార్టీ విజయావకాశాలు, అభ్యర్థుల ఎంపికపై షాతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ , ఎంపీ బండారు దత్తాత్రేయ, కిషన్రెడ్డి చర్చించినట్టు సమాచారం. అభ్యర్థుల ఎంపికపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలిసింది.
అయితే అభ్యర్థుల జాబితాతో ఈ నెల 15న ఢిల్లీ రావాలని నేతలను షా ఆదేశించినట్టు సమాచారం. ఆ రోజే అభ్యర్థులను ప్రకటించనున్నట్టు తెలిసింది. పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై లోక్సభ స్థానాల వారీగా సమీక్షలు చేసింది. నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేసింది రాష్ట్ర భారతీయ జనతా పార్టీ.