మాణికం ఠాగూర్ నోటీసులు: కోమటిరెడ్డికే పంపాలంటూ కేటీఆర్ సెటైర్లు
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మాజీ ఇంఛార్జీ మాణికం ఠాగూర్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పైన పరువు నష్టం దావా వేస్తానన్న మాణికం ఠాగూర్ వ్యాఖ్యలపై ఎక్స్(ట్విట్టర్) వేదికగా కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. నోటీసులు ఎవరికి పంపాలో తెలియని అయోమయంలో మాణికం ఠాగూర్ ఉన్నారని, తప్పుడు అడ్రస్కు పంపినట్లు కేటీఆర్ ఎద్దేవా చేశారు.
మాణికం ఠాగూర్ తోటి కాంగ్రెస్ నాయకులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగానే రేవంత్ రెడ్డి మీకు(మాణికం ఠాగూర్) 50 కోట్ల రూపాయలు ఇచ్చి పీసీసీ పదవి కొనుక్కున్నారని చెప్పిన మాటలను తాను గుర్తు చేశానని కేటీఆర్ చెప్పుకొచ్చారు. పెద్ద ఎత్తున మీడియాలో వచ్చిన రూ. 50 కోట్ల లంచం వార్తలనే తాను ప్రస్తావించానని తెలిపారు. అయితే, జనవరి 28న సిరిసిల్లలో కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలకు గానూ నోటీసులు పంపినట్లు మాణిక్కం ఠాగూర్ తెలిపారు.

కాగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీపై చేసిన ఆరోపణలను ఇప్పటిదాకా వెనక్కి తీసుకోలేదని, కోమటిరెడ్డి తాను చేసిన రూ.50 కోట్ల లంచం వ్యాఖ్యల పైన వివరణ కూడా ఇవ్వలేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. మీరు(మాణికం ఠాగూర్) పంపే పరువు నష్టం నోటీసులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపిస్తే బాగుంటుందని కేటీఆర్ సూచించారు. తన చిరునామాకు కాకుండా మీ ప్రభుత్వంలో సచివాలయంలో కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయానికి పంపించాలని కేటీఆర్ సూచించారు.
Manickam Garu,
— KTR (@KTRBRS) January 31, 2024
Why are you in a confused mode and misdirecting these notices?
It was your colleague congressman & MP Venkat Reddy who had alleged on record that Revanth Reddy bribed you and bought the PCC president post for ₹50 Crore
I had merely quoted the same since it was… https://t.co/YtK6EY9EIj pic.twitter.com/gickKF8Euy
గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డికి కూడా మాణికం ఠాగూర్ నోటీసులు పంపారు.నిరాధార ఆరోపణలు చేసినందుకు గానూ, తన పరువుకు భంగం కలిగించారంటూ మాణిక్కం ఠాగూర్.. ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డికి లీగల్ నోటిస్ పంపారు. వారం రోజుల్లో క్షమాపణ చెప్పకుంటే న్యాయపరంగా ముందుకెళ్తానని హెచ్చరించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై, సుధీర్ రెడ్డి పలు విమర్శలు చేశారు. అందులో భాగంగా మాణిక్కం ఠాగూర్కు రూ.25 కోట్ల లంచం ఇచ్చి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నారని సుధీర్ రెడ్డి ఆరోపించారు. నాటి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాణిక్కం ఠాగూర్, నిరాధారమైన ఆరోపణలు చేసి తన పరువుకు భంగం కలిగించారంటూ లీగల్ నోటీస్ పంపారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications