హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'పదేళ్లేకాదు.. రాజధాని పూర్తయ్యేదాకా', సెక్షన్ 8పై కోర్టుకు సెటిలర్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాదులో పదేళ్లు కాదని, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు ఉంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు హైదరాబాద్ ఉంటుందని విభజన చట్టంలో ఉందని చెప్పారు.

పదేళ్లే కాదని, ఏపీ రాజధాని పూర్తయ్యేదాకా హైదరాబాదును విడిచి వెళ్లమని చెప్పారు. అప్పటిదాకా హైదరాబాద్ నుండే పరిపాలన సాగిస్తామని చెప్పారు. ఉమ్మడి రాజధానిలో ఎవరి పోలీసులు వారికి ఉంటారని చెప్పారు. విభజన చట్టం తానే రాశానని చెప్పుకునే కేసీఆర్.. సెక్షన్ 8 చెల్లదని ఎలా అంటారన్నారు.

Settlers Forum petition in High Court for Section 8

సెటిలర్స్ ఫోరం పిటిషన్

ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సెక్షన్ 8 అమలు కోసం సెటిలర్స్ ఫోరం ఉమ్మడి రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిని హైకోర్టు విచారణకు స్వీకరించింది.

కేంద్ర హోంశాఖ కార్యదర్శి, తెలంగాణ హోంశాఖ సెక్రటరీ, డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్ సీపీలను ప్రతివాదులుగా చేరుస్తూ ఆంధ్రా సెటిలర్స్ ఫోరం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

English summary
Settlers Forum petition in High Court for Section 8
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X