ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారులకు షాక్.. అలా చేస్తే పథకం వర్తించదు జాగ్రత్త!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఇందిరమ్మ నిర్మాణం జోరుగా సాగుతుంది. పేదల సొంతింటి కల నెరవేర్చడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో భాగంగా నిర్మిస్తున్న లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలను అందజేయడం, ఉచిత ఇసుకను అందజేయడం వంటి కార్యక్రమాలతో ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా చూస్తున్నారు.
ఇందిరమ్మ ఇల్లు కడుతున్న వారికి కీలక అలెర్ట్
ఈ పథకాన్ని అమలు చేయడానికి కీలక చర్యలు తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం ఇదే సమయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం విషయంలో లబ్ధిదారులు తప్పులు చేయొద్దని హెచ్చరిస్తోంది. తప్పులు చేస్తే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పొందడానికి అనర్హులవుతారని చెబుతోంది. ఇక ఇదే విషయాన్ని తాజాగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం విషయంలో తెలుసుకోవాల్సిన అంశాలివే
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిబంధనల మేరకే చెయ్యాలని, 400చదరపు అడుగుల నుండి 600చదరపు అడుగుల లోపే ఇంటి నిర్మాణం చేయాలని, నిబంధనలను అతిక్రమిస్తే ఇందిరమ్మ ఇంటి పథకం వర్తించదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హనుమకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన
ఈ సందర్భంగా పేదలకు, బలహీన వర్గాలకు సొంతింటి కల నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇళ్ళ పథకం అందిస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు చేరువవుతుందని అన్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే ఇళ్లపథకంలో లబ్ధిదారులకు డబ్బులు రావు
దళారులను నమ్మి మోసపోవద్దని, నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని చెప్పారు.తెలంగాణలో ప్రభుత్వం పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుందని, 200 యూనిట్ల ఉచిత కరెంట్, రైతు భరోసా, రైతు రుణమాఫీ, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇందిర మహిళా క్రాంతి పథకం తదితర పథకాలను అందిస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ళ పథకం అందాలంటే లబ్ధిదారులు పాటించవలసిన కీలక సూచనలు చేస్తూ నిబంధనలు అతిక్రమిస్తే ఇళ్లపథకంలో లబ్ధిదారులకు డబ్బులు రావని తేల్చి చెప్పారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి పొన్నం
నేడు హన్మకొండ జిల్లాలో కొత్తకొండ ఎర్రబెల్లి నారాయణ గిరి వరకు నిర్మించే డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ముల్కనూరు లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరు జిమ్ సెంటర్లను జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రారంభించారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ములకనూరు మోడల్ స్కూల్ లో మొక్కలు నాటారు. ముల్కనూరు నుండి కొత్తపల్లి వరకు నిర్మించే నూతన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల పట్టాల మంజూరు పత్రాల పంపిణీ
ఆపై ముల్కనూరు లో శ్రీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన పాలనా ప్రగతి బాట కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తో కలిసి లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, స్టీల్ బ్యాంక్ కిట్ల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల పట్టాల మంజూరు పత్రాల పంపిణీ చేశారు. ఆపై ఇందిరమ్మ లబ్దిదారులకు కీలక సూచనలు చేశారు.
-
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం












Click it and Unblock the Notifications