తెలంగాణా కాంగ్రెస్ కు షాక్ .. ఆ ఇద్దరు ఎంపీలు జంప్ అవుతారా ? రాం మాధవ్ ను అందుకే కలిశారా ?
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఒకపక్కన రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలను ఫిరాయింపులకు ప్రోత్సహించి పార్టీకి తీరని నష్టం చేస్తుంటే, మరోపక్క కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బిజెపి సైతం తెలంగాణ కాంగ్రెస్ ను టార్గెట్ చేసింది. అందులో భాగంగా ఇటీవల గెలిచిన ఎంపీల్లో ఇద్దరు ఎంపీలు బిజెపికి జంప్ అవుతారని ప్రచారం జోరుగా సాగుతుంది.
మా గురించి మాట్లాడితే పరువు నష్టం దావా వేస్తాం... టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
Recommended Video
తెలంగాణాపై ఫోకస్ పెట్టిన బీజేపీ .. ఇతర పార్టీల ముఖ్య నేతలకు గాలం
ఇక అసలు విషయానికి వస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక స్థానానికి పరిమితమైన బీజేపీ, లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలను సొంతం చేసుకొని పట్టు సాధించింది. ఇక దీంతో తెలంగాణ రాష్ట్రంపై దృష్టి సారించింది బిజెపి అగ్రనాయకత్వం. అందులో భాగంగా బిజెపి అగ్రనేత రామ్ మాధవ్ ను రంగంలోకి దించింది. దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన బీజేపీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంది .ఇక టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ప్రయత్నాలు ప్రారంభించిన బీజేపీ, కాంగ్రెస్, టిడిపి పార్టీ లోని ముఖ్య నేతలకు గాలం వేస్తోంది.
రామ్ మాధవ్ ను కలిసిన రేవంత్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకట రెడ్డి .. ఇద్దరు ఎంపీలు జంపేనా ?
రానున్న ఐదేళ్ళలో తెలంగాణలో బీజేపీని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మార్చే పనిలో పడ్డారు బీజేపీ నేతలు. అందుకే రాం మాధవ్ తెలంగాణాపై పూర్తిగా దృష్టి సారించారు. ఇక దేశంలో అధికారంలో ఉన్న పార్టీ అని మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న పరిస్థితులతో పార్టీని వీడాలని ఇప్పటికే చాలా మంది నాయకులు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం . ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధపడుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసినట్లుగా తెలుస్తోంది. ఇక వీరితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కెసిఆర్ అన్న కూతురు రమ్యా రావు, మాజీ ఎంపీ వివేక్ కూడా కలిశారని సమాచారం. ఇక ఈ వార్తలను వారు ఖండిస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారడంతో, వారు ప్రత్యామ్నాయంగా బిజెపి వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇద్దరు ఎంపీలు జంప్ అయితే తెలంగాణా కాంగ్రెస్ కు గట్టి దెబ్బ
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశాలు కనిపించకపోవడంతోనే వారు బిజెపిలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారనివార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరారు. ఇక తాజాగా గెలిచిన ముగ్గురు ఎంపీలు ఇద్దరు ఎంపీలు బిజెపి బాట పడితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలినట్లుగా అవుతుంది. మరి ఇంత ప్రచారం జరుగుతున్న ఆ ఎంపీలు పార్టీ మారి బీజేపీ లోకి జంప్ అవుతారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.